Palvai Rajini Kumari: రాష్ట్రంలో మహిళల రక్షణపై KCR సిగ్గుపడాలి.. పాల్వాయి రజిని కుమారి ఘాటు వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో మహిళల పై ప్రతీరోజు ఎదో ఒక చోట అత్యాచారాలు, దాడులు జరుగుతూనేవున్నాయి. చిన్నపిల్లలు, వృద్దులు అని తేడా లేకుండా విచక్షణారహితంగా మహిళలపై నిత్యం దాడులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని,ఇంతజరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తుందని .. BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి తెలిపారు.
ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసు నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని, డీజీపీని కోరారు. కానీ ఇందుకు ప్రభుత్వం గాని డీజీపీ గాని స్పందించలేదు. రాష్ట్ర గవర్నర్ మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా దర్బార్ లో పాల్గొని మహిళలు తమ సమస్యలను చెప్పుకోవడం తప్పా..అని ఆమె ప్రశ్నించారు
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
అయితే TRS నాయకుడు వివేకానంద గవర్నర్ లక్ష్మణ రేఖ దాటుతున్నారంటున్నారు నిజానికి లక్ష్మణ రేఖ దాటింది గవర్నర్ కాదు TRS నేతలే అని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం వున్న పరిస్థితులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే స్పందించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్ సిగ్గుపడాల్సిన పరిస్థితి అని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు రజని కుమారి.
మంత్రివర్గ సమావేశంలో అత్యాచారాల గురించి చర్చించకుండా.. పార్టీ విస్తరణ గురించి చర్చించుకోవడం విడ్డురంగా ఉంది. ఎక్కడ చూసిన మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలను పాఠశాలలకు పంపించాలంటే తల్లి దండ్రులు భయపడుతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లో రాష్ట్ర మహిళా కమిషన్ ఏమీ చేస్తోంది.కనీసం ఒక్క బాధితురాలి దగ్గరికైనా వెళ్లి తాము అండగా ఉంటామని చెప్పారా? వీళ్లకు పదవులు ముఖ్యం తప్పితే.. ఆడ పిల్లల మానప్రాణాలు లెక్క లేదా? కవిత ఇప్పటి వరకు అత్యాచార ఘటనపై ఒక్కసారైనా స్పందించిందా? అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు BJP అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి.
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..