జోగినిపల్లిని ఆశీర్వదించిన పద్మశ్రీ తిమ్మక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమెకు చెట్లు పెంచడం మాత్రమే తెలుసు.. ప్రకృతితో మమేకం కావడమే ఆమె జీవితం.. అందుకే ఈ దేశం ఆమెను “వృక్షమాత” అని కీర్తిస్తుంది. ఆమే సాలుమారద తిమ్మక్క. 111 యేండ్లు వచ్చినా.. చక్కగా నుడుస్తూ వెళ్లి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ఆశీర్వదించి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. అంతేకాదు, 2016లో బీబీసీ ఛానెల్ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో తిమ్మక్క స్థానం దక్కించుకున్నారు. అంతటి మహానుభావురాలు రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న ప్రకృతి సేవకు తరించి, ఆయన్ను ఆశీర్వదించడానికి హైదరాబాద్కు వచ్చారు.
జోగినిపల్లి మనసారా ఆశీర్వదించిన తిమ్మక్క.. తన మొక్కల వారసత్వాన్ని కొనసాగిస్తున్న ఆయన్ను ప్రశంసించింది. ఆనాటి కాలంలో తాను, తన భర్త మాత్రమే మొక్కలు నాటేవాళ్ళమని, అప్పట్లో ఇంత సౌకర్యాలు లేకపోవడం వల్ల ఊరిదాటి వెళ్ళేవాళ్ళ కాదని చెప్పారు. ఇప్పుడు డబ్బు, సౌకర్యాలున్నా.. మనుషుల్లో ప్రకృతిపై ప్రేమ తగ్గిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఎక్కడో ఒక చోట చెట్లంటే ప్రేమున్నవాళ్ళు ఉంటారని, అందుకు జోగినిపల్లి నిదర్శనమని ఆమె అన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో జోగినిపల్లి చేస్తోన్న వృక్ష సేవ కోట్ల మందికి చేరడం అద్భుతమన్నారు. అనుభవించడానికి అన్నీ ఉన్నా.. చెట్లపైన జోగినిపల్లికి ఉన్న ప్రేమ తన హృదయానికి తాకిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read
- CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
- Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ఎన్ని ఇబ్బందులున్నా చెట్ల నాటే కార్యక్రమాన్ని ఆపొద్దని జోగినిపల్లి దగ్గర మాట తీసుకున్న తిమ్మక్క.. తన 111వ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 28న “తిమ్మక్క గ్రీన్ ఫౌండేషన్” ఈ సంవత్సరం జోగినిపల్లికి అందిస్తున్నట్టు తిమ్మక్క తెలిపారు. అనంతరం ఆయనతో కలిసి ప్రగతి భవన్లో మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై ప్రముఖ కవి జూలూరీ గౌరీశంకర్ రాసిన “ఆకుపచ్చని వీలునామా” పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!