Telangana Govt: కులవృత్తులు, చేతివృత్తుల వారికి రూ.1 లక్ష ఆర్థిక సాయంపై ఉత్తర్వులు
Telangana Govt: తెలంగాణ రాష్ట్రంలోని కులవృత్తులు, చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కుల వృత్తులకు, చేతి వృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్ర శేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ప్రకటన అనంతరం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మార్గదర్శకాలకు సంబంధించిన జీవోను బీసీ సంక్షేమ శాఖ తరపున జీవో ఎంఎస్ నంబర్5ను మంగళవారం జారీ చేశారు. కుటుంబంలో ఒక్కరికి రూ.లక్ష ఆర్ధిక సాయం చేయనున్నారు. జూన్ 2, 2023 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయస్సు లోపు వారు అర్హులుగా ఉత్తర్వులో పేర్కొన్నారు.
Read also: Maharashtra: విషాదం.. గోడకూలి ముగ్గురు కార్మికులు మృతి
Also Read
- Abhishek Sharma: హనుమాన్ ఆలయంలో కాటేరమ్మ కొడుకు.. రేపు దబిడిదిబిడే..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
- Kavitha: ప్రస్తుత పాలకులకు అమ్మతనం లేదు.. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు చేయూత నివ్వడం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా
వెనుకబడిన వర్గాలకు చెందిన కులవృత్తులు, చేతివృత్తులకు వారికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కుటుంబంలో ఒక్కరికి రూ. లక్ష ఆర్ధిక సాయం చేస్తారు. రూ. లక్ష ఆర్థిక సాయం పొందడం కోసం లబ్ధిదారులు జూన్ 2, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. ఆర్థిక సాయం పొందాలనుకునే వారు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం నుండి ఆర్ధిక సాయం పొందినవారు అనర్హులు. ఆర్థిక సాయం పొందే వారి వార్షిక ఆదాయం రూ. 1 లక్ష 50 వేలు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు పట్టణ ప్రాంతాల్లో ఆదాయం ఉన్నవారు అర్హులు.
Read also: Viral Video: కేఎస్ భరత్తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దరఖాస్తులను ఈనెల 6వ తేదీ నుండి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. మండలం, మున్సిపాలిటీల్లో ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను ఎంపిడిఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈనెల 20 వ తేదీ నుండి 26వ తేదీ లోపు పరిశీలన చేసి కలెక్టర్కు నివేదికను సమర్పిస్తారు. దరఖాస్తుల్లో అర్హులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ.. ఆ జిల్లా ఇంచార్జ్ మంత్రి ని అర్హుల జాబితాపై ఈనెల 27 నుండి వచ్చే నెల 4 లోపు అనుమతి తీసుకోవాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవ్ చేసిన అనంతరం అర్హుల జాబితాను జిల్లా, మండల, గ్రామ పంచాయతీ స్థాయిలో వెబ్ సైట్ లో పొందుపర్చాలని పేర్కొంటూ ఉత్తర్వులను జారీ చేశారు.
తాజావార్తలు
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
-
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్కు భారత మహిళల జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!