Telanganan:బర్రెను తప్పించబోయి బస్సు బోల్తా..15 మందికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయటి వెళ్లినవారు ఎప్పుడు ఎలా తిరిగొస్తారో తెలియక ఇంట్లో ఉన్నవాళ్లు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో వున్న 15మంది తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఇక వివరాల్లోకి వెళితే.. కర్ణాటక లోని హుబ్లీ నుంచి హైదరాబాద్ కు 45 మంది ప్రయాణికులతో బయలు దేరింది. నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్దకు రాగానే ప్రయాణిస్తున్న బస్సుకు అడ్డంగా బర్రె వచ్చింది. దీంతో డ్రైవర్ బర్రెను తప్పించేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అదుపుతప్పిన బస్సు బోల్తా పడింది. అయితే బస్సులో ఉన్న సుమారు 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నామని తెలిపారు.
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లో ఇలాంటి ఘటనే మే 10న (మంగళవారం)ఉదయం చోటుచేసుకుంది. బస్సు-బొలెరో వాహనం ఢీకొని మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనమైన ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వద్ద చోటుచేసుకుంది. ఓప్రైవేటు బస్సు, బొలెరో వాహనం ఢీకొని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలోని వ్యక్తి సజీవదహనం సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుడు, గాయపడిన వారు కర్ణాటక వాసులుగా గుర్తించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ల అప్రమత్తం లేకపోవడంవల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!