Congress Walkout: శాసనసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. ప్లాకార్డులతో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Walkout: తెలంగాణ శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ పార్టీ ఈరోజు శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. శాసనసభలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం సభ నుంచి వాకౌట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్కలు అసెంబ్లీ పరిసరాల్లో ప్లకార్డులతో నిరసన తెలిపారు. కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులకు 24 గంటల త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read also: BIG Breking: రెండు తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా
Also Read
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఈ సందర్భంగా సీఎల్పీ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. అందుకే నిరసనకు దిగారు. రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగిపోయాయని అన్నారు. రైతులకు 4 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదన్నారు. కరెంటు ఏ సమయంలో ఇస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చామని, అయితే స్పీకర్ చర్చకు అనుమతించలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలపై కరెంట్ ఛార్జీల రూపంలో రూ. 16 వేల కోట్ల భారం వేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సీతక్క మాట్లాడుతూ.. పంటలు పండే సమయంలో కరెంట్ కట్ చేస్తున్నారని విమర్శించారు. నాణ్యమైన కరెంట్ అందించి రైతులను ఆదుకోవాలని సీతక్క కోరారు.
Fire Accident: సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద అగ్నిప్రమాదం.. మంటలు చెలరేగడంతో..
తాజావార్తలు
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!