Revanth Reddy: గోడదూకిన రేవంత్ రెడ్డి.. అందరూ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మహబూబాద్ జిల్లా మరిపెడ మండలంలో పాదయాత్ర చేస్తున్నారు. సంఘిన సంక్షేమ గురుకుల పాఠశాలకు గోడ దూకి వెళ్లారు. ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా మాట్లాడారు. విద్యార్థులు రేవంత్ రెడ్డి గోడ దూకి రావడం చూసి ఆనందం ఆకాశాన్నంటాయి. వారిని కలవడానికి గోడదూకి రావడంతో షాక్ కు గరయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఆర్సీ అమలులో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయుల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వికలాంగుడైన బాల ఇంటికి వెళ్లి ఎల్లంపేట స్టేజీ తండాలో రేవంత్ రెడ్డిని కలిశారు. నడవలేని, మాట్లాడలేని 21 ఏళ్ల వికలాంగ బాలుడు తన తల్లి సంరక్షణలో ఉన్నాడు. బాలు తండ్రి చనిపోయాడు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని బాలు తల్లి భూక్య తులసి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వితంతు పింఛన్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి స్పందించి ఆ కుటుంబానికి రూ.10 వేల సాయం చేశారు. కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తాజాగా ప్రగతి భవన్పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Read also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో 21 వేలకు చేరిన మరణాలు.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Also Read
- Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- Bhatti Vikramarka : తెలంగాణపై భట్టి ఫోకస్.. రూ.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ టార్గెట్.!
- Smart Ration Cards : గుడ్న్యూస్.. తెలంగాణలో ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు
- Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారాన్ని రేపుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ పై మరోసారి హాట్ హాట్ వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ను బీఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్గా మారుస్తామని స్పష్టం చేశారు. కేటీఆర్ వేల కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. మియాపూర్లో ఎమ్మెల్సీ కవితకు 500 కోట్ల భూమి ఎలా వచ్చిందని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. ఆదిత్య కన్స్ట్రక్షన్కు భూమి కేటాయించారని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రభుత్వ భూములను కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.ఈ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. నిషేధిత జాబితాలోని భూములను ఆ జాబితా నుంచి తొలగించి బదిలీ చేసిన వారి పేర్లను వెల్లడించాలి. తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమన్నారు.
Pakistan Economic Crisis: పాకిస్తాన్ పని ఖతం..ఐఎంఎఫ్తో చర్చలు విఫలం..
తాజావార్తలు
-
Homemade Vegetable Chips: బంగాళాదుంప చిప్స్కు బైబై.. ఈ 8 కూరగాయలతో ఇంట్లోనే క్రిస్పీ చిప్స్!
-
CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
-
Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
-
Balloon Gas Cylinder Blast : మియాపూర్లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
-
Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!