TRS: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఎన్నారైల మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు తమ అధినేత నిర్ణయానికి మద్దతుగా నిలుస్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. టీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ అధినేత దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కోరుకుంటున్నారు.
తాజాగా కేసీఆర్ నిర్ణయానికి ఎన్నారైలు మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నాయకత్వం జాతీయ రాజకీయాలకు అవసరం అని వారంతా అన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వం అవసరంపై తెలంగాణ ఎన్నారై మహేష్ బిగాల ప్రపంచ దేశాల్లో ఉన్న ఎన్నారైలతో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఇందులో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అవసరంపై మహేష్ బిగాల ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణకు చెందిన ఎన్నారైలు ఏకగ్రీవంగా ఆమోదించారు.
Also Read
- OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- CM Revanth Reddy : ‘ఒక్క ఓటు కూడా డిలీట్ కావొద్దు’.. కాంగ్రెస్ నేతలకు రేవంత్ అలర్ట్.!
- Venkat Reddy: మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర సమితి( టీఆర్ఎస్) త్వరలోనే భారత రాష్ట్ర సమితి( బీఆర్ఎస్) గా మారుబోతున్న నేపథ్యంలో ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రపంచదేశాల్లోని ఎన్నారైలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ గారి నాయకత్వం అవసరం అని అందరు ఎన్నారైలు ముక్తకంఠంతో కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతించారు.
రాదనుకున్న తెలంగాణను ఎన్నో ఉద్యమాలు చేసి అందరిని ఏకం చేసి తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని.. ఆయన మార్గదర్శనంలో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని ఎన్నారైలు సమావేశంలో అన్నారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన సమయంలో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అందరిని కలుపుకుపోతే కీలక పాత్ర పోషిస్తారనే నమ్మకం ఉందని అన్నారు.
భారత దేశంలో అపారమైన వనరులున్నా వాటిని వాడుకునే నైపుణ్యాలు కేంద్రాన్ని నడుపుతున్న ప్రభుత్వాలకు లేవని.. వారికి ప్రజల పట్ల నిబద్ధత లేకుండా పోయిందని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడమే కానీ.. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏమీ వారు అమలు చేయడానికి సిద్దంగా లేరని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లో సమావేశాల్లో ప్రజల అవసరాలపై మాట్లాడకుండా జైశ్రీరాం నినాదాలతో అడ్డుకుంటన్నారని విమర్శించారు. తెలంగాణ వంటి ఆదర్శవంతమైన పాలన తీసుకురావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాల్సిందే అని ఎన్నారైలు అంతా ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..