Election of Two MLC Seats: రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election of Two MLC Seats: తెలంగాణ శాసనమండలిలోని రెండు ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు స్థానాలకు వేర్వేరుగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ కార్యాలయం వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనవరి 18 వరకు నామినేషన్ల స్వీకరణ.. జనవరి 19న నామినేషన్ల పరిశీలన, 22తో డ్రాకు గడువు. జనవరి 29న పోలింగ్.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. ఉపఎన్నికలు వేరుగా ఉండడంతో ఇద్దరు ఎమ్మెల్సీలు కాంగ్రెస్కు చేరనున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎమ్మెల్సీ పదవుల రేసులో చాలా మంది ఉన్నారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. దీంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో రెండు స్థానాలకు ఎన్నికల సంఘం ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది.
Read also: Gunturu Kaaram: ఏంటి అట్టా చూస్తున్నావ్.. బీడీ త్రీడీలో కనబడుతుందా! మేకింగ్ వీడియో రిలీజ్
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Supreme Court: పెళ్లికి ముందు శృంగారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
సాధారణంగా ఎమ్మెల్సీ పదవీ కాలం ఆరేళ్లు. మధ్యలో ఏదైనా సీటు ఖాళీ అయితే ఉప ఎన్నిక నిర్వహిస్తారు. ఇలా చాలా సార్లు జరిగింది. అయితే ఈసారి రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఒకేసారి ఖాళీగా ఉన్నాయి. శాసన మండలి సభ్యులుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇద్దరూ డిసెంబర్ 9న తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారి పదవీకాలం 30 నవంబర్ 2027 వరకు ఉంది. కానీ వారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత వీటికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఈసారి రెండు వేర్వేరు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించనుండటంతో లెక్కలు మారిపోయాయి. ప్రత్యేక బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరిగితే ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్కు ఆ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్కు పెద్ద దెబ్బే. అందుకే ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. కానీ ఒకటి కంటే ఎక్కువ స్థానాలకు ఎన్నికలు జరిగితే రెండు వేర్వేరు బ్యాలెట్ పేపర్లు తప్పనిసరి అని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది.
Shraddha Das: బిజినెస్ మ్యాన్ తో పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన హాట్ బ్యూటీ..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!