Fight For Mutton Curry: పెళ్లి విందులో ‘మటన్’ పంచాయతీ.. గరిటెలు, రాళ్లు, కర్రలతో దాడి.. పరస్పరం కేసులు..
- పెళ్లి విందులో మటన్ కర్రీ కోసం పంచాయతీ..
- పెళ్లి విందులో రసాభాస..
- మాంసాహారం కోసం వరుడు.. వధువు బంధువుల పరస్పరం దాడులు..
- 19 మందిపై కేసులు నమోదు..
Fight For Mutton Curry: పెళ్లితో పాటు కొన్ని శుభకార్యాల్లో నాన్వెజ్ కోసం గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. మాకు మటన్ సరిగా వడ్డించలేదని.. చికెన్ తగినంత వేయలేదని.. ఇదేనా పెళ్లి కొడుకు తరఫు బంధువులను చూసుకునే విధానం.. ఇదేనా.. పెళ్లి కూతురు బంధువులకు ఇచ్చే మర్యాదా అంటూ.. రకరకాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, తాజాగా నిజామాబాద్ జిల్లాలో మటన్ ముక్కలు పంచాయితీ పెట్టాయి.. పెళ్లి విందులో రసాభాసకు కారణంగా మారాయి.. పెళ్లి భోజనంలో మాంసాహారం కోసం వరుడు, వధువు తరపు బంధువులు పరస్పరం దాడులు చేసుకున్నారు.. అంతేకాదు.. 19 మందిపై కేసులు కూడా నమోదు అయ్యాయి..
Read Also: Viral Video: వామ్మో.. ఇలాంటి వారితో జాగ్రత్త సుమీ..
Also Read
నిజామాబాద్ జిల్లా నవీపేటలో బుధవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నవీపేటకు చెందిన ఓ యువతితో నందిపేట మండలానికి చెందిన ఓ యువకుడికి నవీపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరిపించారు. అనంతరం విందులో.. వరుడు తరఫు నుంచి వచ్చిన కొందరు యువకులకు మాంసాహారం వడ్డించారు. కానీ, మటన్ ముక్కలు తక్కువ వేశారంటూ.. వడ్డించే వ్యక్తులతో ఆ యువకులు వాగ్వాదానికి దిగారు. దీనిపై వధువు బంధువులు కల్పించుకోవడంతో ఇరు పక్షాల మధ్య గొడవ తీవ్రమైంది. వంట గరిటెలు, రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు పాల్పడటంతో కొంతసేపు ఉద్రిక్తత నెల కొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. ఒక వర్గానికి చెందిన ఈర్నాల సత్యనారాయణతో పాటు మరో 11 మంది, మరో వర్గానికి చెందిన పత్రి సాయిబాబాతో పాటు మరో ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.. గాయపడిన ఎనిమిది మందిని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!
-
Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
-
KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
-
Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
-
Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో