అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తి అంటే ఎలా..?: నిరంజన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, “కోఆపరేటివ్ ఫెడలరిజమ్” కాదు…సెలెక్టివ్ ఫెడలరిజమ్ అంటూ విమర్శించారు. వారికి నచ్చింది చెయ్యడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు.
గోడౌన్లు, రైళ్లు, ఎగుమతుల పై అనుమతులు ఇచ్చే అధికారం కేంద్రం వద్ద పెట్టుకుని, ఆపద వచ్చినప్పడు రాష్ట్రాలను పట్టించుకోమంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు. దేశానికి అవసరమైన పప్పు గింజలు, నూనెగింజలను పండించుకునే ముందు చూపు లేని కేంద్రప్రభుత్వం ఏం ప్రభుత్వమని అంటూ నిలదీశారు. దేశ అవసరాలను తీర్చే విధంగా, స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన దేశభక్తి అని మంత్రి అన్నారు. దేశభక్తి పై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, హృదయం కూడా విశాలంగా ఉండాలని మంత్రి అన్నారు.
Also Read
- TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
- OTR: టీఆర్ఎస్ పేరు చుట్టూ కొత్త వివాదాలు..తెలంగాణ రక్షణసేన పేరుకు ఈసీ బ్రేక్స్
- OTR: ఉమ్మడి నల్గొండ పరిధిలోకి అడుగుపెట్టని బీఆర్ఎస్ అగ్రనేతలు...అసలు కారణాలేంటి ?
- CM Revanth Reddy : మిడ్జిల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం.. నాడు మీరు నాటిన మొక్కే.. నేడు సీఎంగా..
కేంద్రానిదే తప్పు అని నిరూపించగలిగాం: ఎర్రబెల్లి దయాకర్రావు
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కేంద్ర మంత్రి తో మాట్లాడిన తర్వాత తప్పు కేంద్రానిదే అని నిరూపించగలిగాం. మాకు తెలియకుండా కేంద్రం లిఖితపూర్వక హామీ ఇస్తుందా అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని మంత్రి అన్నారు. రెండు రోజుల్లో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారని ఎర్రబెల్లి అన్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ కేంద్ర మంత్రి లిఖిత పూర్వక హమీ ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టబోమన్నారు. రైతుల నుంచి రాష్ర్టం కొన్న ధాన్యాన్ని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి పోస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
తాజావార్తలు
-
OTR : అనంతపురం జిల్లా వైసీపీలో తోపుదుర్తి ఒంటరి అయ్యారా?
-
Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
-
TGEAPCET 2026: ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు విడుదల.. పూర్తి వివరాలు ఇవే!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Kannappa: యూట్యూబ్లో విష్ణు మంచు ‘కన్నప్ప’
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..