అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి దేశభక్తి అంటే ఎలా..?: నిరంజన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీకి వెళ్లిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. కేంద్ర ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ..ఇది చాలా గంభీరమైన విషయమన్నారు. మరోసారి సమీక్ష చేసి రైతాంగాన్ని సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదన్నారు. అందమైన భాషలో ఉపన్యాసాలు ఇచ్చి, ఇదే దేశ భక్తి అంటే ఎలా…? అని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం, “కోఆపరేటివ్ ఫెడలరిజమ్” కాదు…సెలెక్టివ్ ఫెడలరిజమ్ అంటూ విమర్శించారు. వారికి నచ్చింది చెయ్యడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందన్నారు.
గోడౌన్లు, రైళ్లు, ఎగుమతుల పై అనుమతులు ఇచ్చే అధికారం కేంద్రం వద్ద పెట్టుకుని, ఆపద వచ్చినప్పడు రాష్ట్రాలను పట్టించుకోమంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు. దేశానికి అవసరమైన పప్పు గింజలు, నూనెగింజలను పండించుకునే ముందు చూపు లేని కేంద్రప్రభుత్వం ఏం ప్రభుత్వమని అంటూ నిలదీశారు. దేశ అవసరాలను తీర్చే విధంగా, స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన దేశభక్తి అని మంత్రి అన్నారు. దేశభక్తి పై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు, హృదయం కూడా విశాలంగా ఉండాలని మంత్రి అన్నారు.
Also Read
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
కేంద్రానిదే తప్పు అని నిరూపించగలిగాం: ఎర్రబెల్లి దయాకర్రావు
అనంతరం ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..కేంద్ర మంత్రి తో మాట్లాడిన తర్వాత తప్పు కేంద్రానిదే అని నిరూపించగలిగాం. మాకు తెలియకుండా కేంద్రం లిఖితపూర్వక హామీ ఇస్తుందా అని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారని మంత్రి అన్నారు. రెండు రోజుల్లో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారని ఎర్రబెల్లి అన్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ కేంద్ర మంత్రి లిఖిత పూర్వక హమీ ఇవ్వలేదన్నారు. ఈ సమస్యను ఇంతటితో వదిలిపెట్టబోమన్నారు. రైతుల నుంచి రాష్ర్టం కొన్న ధాన్యాన్ని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి పోస్తామని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!