Dowry Harassment: మైలార్ దేవ్ పల్లిలో విషాదం.. అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య
Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. అయితే ఆ ఆశలన్నీ నిరాశనే మిగిల్చాయి. కొన్నినెలలు ఆనందంగా సాగిన వారిజీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నంకోసం భర్త మానసికంగా.. శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పుట్టింటి వారికి చెబితే బాధపడతారని చెప్పలేక నరకయాతన పడింది. భర్తతో పాటు అత్తమామ తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేక సహకోల్పోయిన వధువు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారికి పుట్టెడు దుఖం మిగిల్చింది. ఈఘటన మైలార్ దేవ్పల్లిలో జరిగింది.
Read also: Roller Coaster: పాడై పోయిన రోలర్ కోస్టర్.. మూడు గంటల పాటు తలకిందులుగా వేలాడారు
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నవ వధువు కవిత ఆత్మహత్య కలకలం రేపింది. గత ఏడు నెలల క్రితం కాటేదాన్ నేతాజీ నగర్ కు చెందిన చంద్ర శేఖర్ తో వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని రోజులకే తన అసలు రూపం బయట పెట్టాడు. అదనపు కట్నం తేవాలని వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురిచేశాడు. భర్తకు వేధింపులకు తోడు అత్తా, మామలతో పాటు ఆడపడుచు సూటి పొటి మాటలు ఎక్కువయ్యాయి. సహనం కోల్పోయిన కవిత తనువు చాలించాలని అనుకుంది. గదిలోకి వెళ్లి ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణంకు పాల్పడ్డ కవిత. ఎంతసేపు గది నుంచి కవిత రాకపోయే సరికి భర్త చంద్ర శేఖర్ వెళ్లి చూడగా కవిత ఫ్యాన్ కు వేళాడుతూ కనిపించింది.
దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపాడు. దీంతో భయాందోళన చెందిన అత్తింటి వారు కవిత కుటుంబానికి కవిత చనిపోయినట్లు కాల్ చేసి చెప్పారు. షాక్ కు గురైన కవిత తల్లిదండ్రులు హుటా హుటిన కవిత అత్తింటి చేరుకున్నారు. కవిత విగత జీవిగ పడిఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరు అయ్యారు. కవిత ఎలా చనిపోయిందంటూ ప్రశ్నించారు. మొన్నటి వరకు బాగున్న కూతురు ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటని నిలదీశారు. భర్త, అత్తింటి వారు ఏమీ చెప్పకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మైలార్ దేవ్ పల్లి పోలీసులు నలుగురిపై 304 B సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రుల ఇంటికి మల్కాజ్గిరి డిసిపి చేరుకున్నారు. కవిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కవిత గురించి అడిగి తెలుసుకున్నారు.
Andhrapradesh: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులు మంజూరు
తాజావార్తలు
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
-
Bank Robbery: పట్టపగలు SBI బ్యాంక్లో ఘరానా దోపిడీ.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో