Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Nazimabad Residents Work On Kaleshwaram

Kaleshwaram Project:పోలీస్ పహారాలో కాళేశ్వరం

Published Date :May 26, 2022 , 8:39 am
By NTV WebDesk
Kaleshwaram Project:పోలీస్ పహారాలో కాళేశ్వరం
  • Follow Us :
  • google news
  • dailyhunt

గోదావరి నీళ్ల‌ తరలింపున‌కు సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు నిజామాబాద్ జిల్లాలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్యాకేజీ 21 లో చేపట్టబోయే రిజర్వాయర్ కు భూములు ఇచ్చేందుకు ముప్పు గ్రామాల ప్రజలు ససేమిరా అంటున్నారు.. ప్రాజెక్టు ప‌నుల‌ను పదే పదే అడ్డుకుంటూన్నారు.. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పనులు జరిపిస్తున్నారు.. అయినా ముప్పున‌కు గుర‌వుతున్న గ్రామాల ప్ర‌జ‌లు చానైన చ‌స్తాము.. కానీ రిడిజైన్ తో ప్రాజెక్టు ప‌నులు చేసే ఊరుకునేది లేద‌ని ఆందోళ‌న బాట ప‌ట్టారు.

అధికారులు మాత్రం ప‌నులు కొన‌సాగించేదుకు ముప్పు గ్రామ‌ల ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. కానీ పబ్లిక్ మీటింగ్ కాస్తా రసాభాసగా మారింది. మంచిప్ప, భైరాపూర్ వద్ద పోలీస్ పహారాలో కాళేశ్వరం రిజర్వాయర్ పనులను మొదలు పెట్టారు అధికారులు. దీంతో తెల్లవారుజామున నుంచే వారిని అడ్డుకునేందుకు వచ్చిన నిర్వాసితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప గ్రామం చుట్టూ అడవులతో విస్తరించి ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం.. రిజర్వాయర్ నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ద మ‌వ్వ‌డంతో ముప్పునకు గుర‌వ‌తున్న గ్రామాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన రెండు చెరువులను కలుపుతూ రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది..

ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద ఇప్పటికే ఈ గ్రామం చుట్టూ కాల్వలు తవ్వారు. 21 ప్యాకేజీ కింద గోదావరి జలాలు తరలించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి ఇక్క‌డి నుంచి మంచిప్ప‌, మాసాని చెరువును నింపి నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

రీడిజైన్‌తోనే సమస్య..

ఇదంతా బాగానే ఉన్నా ప్రాణ‌హిత‌ డిజైన్ మార్చి కాలేశ్వరంతో అనుసంధానం చేసేందుకు కొత్త ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ఎస్ఆర్ఎస్పి ఎగువ‌ భాగం నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నిజామాబాద్ మండలంలోని చెరువు నింపుతారు. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా మంచిప్ప‌ చెరువులోకి నీటిని తరలిస్తారు.

అయితే ఈ చెరువును కొండెము చెరువుతో కలిపి మూడున్నర టీఎంసీల సామర్థ్యంనికి పెంచానున్నారు. ఇక్కడి నుంచి 17 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా డిచ్‌పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, భీంగ‌ల్ మీదుగా జగిత్యాల జిల్లాలోని మెట్ ప‌ల్లి వరకు నీటిని అందించాలని నిర్మాణాలు చేపడుతున్నారు. ప్యాకేజీ 21 కింద లక్ష 84 వేల ఎకరాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం 1,200 ఎకరాల భూమిని సేకరించారు. మరో ఎనిమిది వందల ఎకరాలను అటవీ భూమిని కూడా తీసుకోనున్నారు.

సర్కారు సంప్రదింపులు..

అయితే.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.. ఆ సమావేశంలో మా భూములు మాకు కావాలి.. రిడిజైన్ ర‌ద్దు చేయాల‌ని ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న తెలిపారు.. అయితే రిడిజైన్ ప‌క్క‌న పెట్టిప్రాజెక్టు ప‌నులు పూర్తి చేసేందుకు మీరు ఓప్పు కోవాలని జాయింట్ క‌లెక్ట‌ర్ చంద్ర‌శేఖర్ కోరారు..

అయితే ముంపు గ్రామాల ప్ర‌జ‌లు మాత్రం మీరు రిడిజైన్ ప‌నులు చేయామ‌ని మాకు రాత పూర్వ‌కంగా వ్రాసిస్తేనే ఒప్పుకుంటామ‌న్నారు.. దీంతో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించలేదు. ముంపు గ్రామాల ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చెతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటు చూస్తున్నారు. ఈసమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతోందని అనుకునే లోపే పోలీసులు భారీ బందోబ‌స్తు న‌డుమ కాళేశ్వ‌రం రిజ‌ర్వాయ‌ర్‌ ప్రాజెక్టు ప‌నుల‌ను ప్రారంభించింది. దీంతో అక్కడి నిర్వాసితులు ప‌నుల‌ను అడ్డుకునేందుకు రావ‌డంతో వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kaleshwaram
  • Nizamabad
  • police
  • Tensions
  • work start

తాజావార్తలు

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions