Medigadda Barrage: కుంగడానికి కారణం ఇదే.. మేడిగడ్డ బ్యారేజ్ పై ఎన్డీఎస్ఏ నివేదిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medigadda Barrage: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ కుప్పకూలడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ శుక్రవారం తన నివేదికను సమర్పించింది. బ్యారేజీ పునాదుల కింద ఇసుక పోయడం వల్లే బ్యారేజీ కూలిపోయిందని నిర్ధారించారు. బ్యారేజీ కూలిపోవడానికి పలు కారణాలను తమ నివేదికలో పొందుపరిచారు. బ్యారేజీ పునాదుల కింద ఇసుక కోతకు గురికావడం వల్లే కూలిపోయిందని నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీ పునాదికి వినియోగించిన మెటీరియల్ నాణ్యత లోపించిందన్నారు. బ్యారేజీ లోడ్ వల్ల ఇసుకపై ఉన్న కంకర కూడా కొట్టుకుపోయిందని, దీంతో పిల్లర్లు బలహీనంగా మారాయన్నారు.
డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. కమిటీ కోరిన డేటాను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. కమిటీ అడిగిన 20 అంశాల్లో కేవలం 11 అంశాలకే డేటా ఇచ్చారని నివేదిక పేర్కొంది. బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా నిర్మించారని, మరమ్మతులు పూర్తయ్యే వరకు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండకూడదని పేర్కొంది. బ్యారేజీ నిర్మాణ సమయంలో అవసరమైన అధ్యయనాలు, పరీక్షలు నిర్వహించలేదు. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని ఇతర నిర్మాణాలను కూడా పరిశీలించాలని నివేదికలో పేర్కొంది. శిథిలావస్థలో ఉన్న బ్యారేజీని పునరుద్ధరించే వరకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
NDSA ఇచ్చిన కారణాలు..
* ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్, మెయింటెనెన్స్ వైఫల్యంతో మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కూలిపోయాయి.
* బ్యారేజీ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయింది
* పునాది పదార్థం ఘనమైనది కాదు
* బ్యారేజీ లోడ్ కారణంగా కాంక్రీటు తెగిపోయింది
* బ్యారేజీని ఫ్లోటింగ్ స్ట్రక్చర్గా డిజైన్ చేశారు కానీ ఫిక్స్డ్ స్ట్రక్చర్గా కాదు
* బ్యారేజీ విఫలమైతే ఆర్థిక వ్యవస్థకు, ప్రజాజీవితానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది
* బ్యారేజీ బ్లాకుల సమస్య కారణంగా మొత్తం బ్యారేజీని వినియోగించుకునే అవకాశం లేదు
* ఈ దశలో రిజర్వాయర్ నిండితే బ్యారేజీ మరింత కుంగిపోతుంది
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అన్నారం, సుందిళ్లను మేడిగడ్డ తరహాలోనే నిర్మించారు. ఈ రెండు ప్రాజెక్టులు కూడా అదే పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. అన్నారం, సుందిలను యుద్ధ ప్రాతిపదికన వెంటనే తనిఖీ చేయాలి. అన్నారం, సుందిళ్లలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి’’ అని డ్యాం అధికార యంత్రాంగం తన నివేదికలో పేర్కొంది.
Jio: ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు టెన్షన్ ఉండదు.. జియో వార్షిక ప్లాన్ జాబితా ఇదే
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!