Nandakumar: GHMC కమిషనర్ పై చర్యలు తీసుకోండి.. హైకోర్ట్ ను ఆశ్రయించిన నందకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandakumar: ఎమ్మెల్యే ల ఎర కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయిన నందకుమార్ హైకోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన జీహెచ్ ఎంసీ కమిషనర్, మరో ముగ్గురు టౌన్ ప్లానింగ్ అధికారులపై కోర్టు ధిక్కరణ కేసును విధించింది. దీంతో.. హైకోర్ట్ లో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ ను నందకుమార్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసి తన పొజిషన్ లో వున్న బిల్డింగ్ ను కూల్చేశారు అంటూ నందకుమార్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. GHMC కమిషనర్ లోకేష్ కుమార్, జూబ్లీహిల్స్ జోనల్ కమిషనర్ రవితేజ, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ లపై చర్యలు తీసుకోవాలని నందకుమార్ హైకోర్ట్ ను కోరారు. గత ఏడాది నవంబర్ 11న రిట్ పిటిషన్ 18529/ 2021, మరో రిట్ పిటిషన్ 18645/2021 లో.. హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోలేదని నందకుమార్ హైకోర్టును ఆశ్రయించారు.
Read also: Variety Thief: అట్టముక్కతో దొంగతనం.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో నిందితులు రామచంద్రభారతి, నందకుమార్లకు బెయిల్ మంజూరు కావడంతో పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. బోగస్ ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామచంద్ర భారతిని, బంజారాహిల్స్లో నమోదైన మోసం కేసులో నందకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. దోమ మండలంలో భూమి విషయంలో సతీష్ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడన్న ఫిర్యాదు మేరకు నందకుమార్పై ఐపీసీ సెక్షన్ 386, 387 కింద కేసు నమోదు చేశారు. అప్పట్లో వీరి అరెస్ట్ కూడా ఆసక్తికరంగా మారింది. మొయినాబాద్ ఫాంహౌస్ సెంటర్లో జరిగిన ఎమ్మెల్యేల కేసులో ఏ1 రామచంద్ర భారతి, ఏ2 నందకుమార్లు నాంపల్లి కోర్టులో ఒక్కొక్కరు రూ.6 లక్షల పూచీకత్తు సమర్పించడంతో బెయిల్ మంజూరైంది. నిందితులు డిసెంబర్ 8న చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు.ఇదే కేసులో సింహయాజీకి కూడా బెయిల్ మంజూరైంది. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. రూ.6 లక్షల పూచీకత్తు మరియు ఇద్దరు పూచీకత్తులను సమర్పించిన తర్వాత సింహయాజీ న్యాయవాది విడుదలయ్యారు. దాదాపు నెల రోజుల తర్వాత నందకుమార్ రెండో కేసులో బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.
Mumbai : ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేసినందుకు భార్యకు త్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!