Nama Nageswara Rao : అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధాన్యం కొనుగోళ్లపై టీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగంపై కేంద్రం కక్ష్య కట్టిందని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోలు విషయం కేంద్ర ప్రభుత్వ దృష్టికి అన్ని రకాలుగా తీసుకు వెళ్లామని ఆయన అన్నారు. ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అభివృద్ధిలో అడ్డంకులు, రైతుల ధాన్యం కొనడానికి అడ్డంకులు.. అన్నింటికి కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు ఇళ్లపై నల్ల జెండాలతో నిరసన తెలిపారని ఆయన వెల్లడించారు.
వరి పంటలో భారత్ నెంబర్ వన్ గా ఉందని, తెలంగాణ బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట చెప్తున్నారని ఆయన విమర్శించారు. రైతులను అవమాన పరుస్తున్నారని, తెలంగాణ పై ఎందుకింత కక్ష్య సాధింపు అంటూ ఆయన ధ్వజమెత్తారు. భారత్లో తెలంగాణ లేదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేంత వరకు పోరాటం చేస్తామని, రాబోయే కాలంలో కేంద్రానికి బుద్ది చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
https://ntvtelugu.com/vijayashanthi-fired-on-ts-paddy-procurement/
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!