Nallala Odelu: ప్రచారానికి వస్తే చెప్పులతో తరమండి.. బాల్క సుమన్ పై ఓదెలు ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallala Odelu: బాల్క సుమన్ ఎక్కడికి ప్రచారం కు వచ్చినా చెప్పుల తో తరమాలని కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివేక్ ఇంట్లో ఐటి దాడుల పై నల్లాల ఓదెలు స్పందించారు. కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణ చూసి దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సుమన్ పిరికి వాడని కీలక వ్యాఖ్యలు చేశారు. సుమన్ భయపడి ఐటీతో దాడులు చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమన్ అసలు రూపం బయట పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటి దాడులతో వివేక్ కు మరింత మైలేజ్ వస్తుందని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. బాల్క సుమన్ ఎక్కడికి ప్రచారంకు వచ్చినా చెప్పులతో తరమాలి ఓదెలు ఘూటు వ్యాఖ్యలు చేశారు.
Read also: Kartarpur Gurdwara: కర్తార్పూర్ గురుద్వారాలో డ్యాన్స్ పార్టీ.. సిక్కులు తీవ్ర ఆగ్రహం
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్, మంచారియాలోని వివేక్ ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. వివేక్ ఇంటితో పాటు ఆయనకు సంబంధించిన కంపెనీలు, ఆయన ముఖ్య అనుచరులు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. వివేక్కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు బదిలీ అయిన రూ.8 కోట్లను సైఫాబాద్ పోలీసులు ఇటీవల స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. సోమాజిగూడలోని వివేక్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. నాలుగైదు గంటల పాటు తనిఖీలు సాగాయి. స్తంభించిన నగదుపై ఈ నెల 13న ఐటీ అధికారులు ఆరా తీశారు. కాగా, మంచిర్యాలలోని వివేక్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి.
ఇక మరోవైపు అంగీలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తులకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని వివేక్ పై చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వివేక్ కంపెనీ నుంచి ఒక సూట్ కేసు కంపెనీకి సోమవారం ఎనిమిది కోట్లు బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూట్ కేసు కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లు వివేక్ కంపెనీ ఉద్యోగులని ఆరోపించారు. ఆ కంపెనీ రామగుండం లో వివేక్ ఇంటి చిరునామా పైనే ఉందని అన్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ కు ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఖాతాను ఫ్రీజ్ చేయాలని కోరామన్నారు. ఈడీ, ఆదాయ పన్ను శాఖలకు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రత్యేక వ్యయ పరిశీలకునికి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. వివేక్, కుటుంబ సభ్యులు, కంపెనీలు, బంధువుల బ్యాంకు ఖాతాల పై నిఘా పెట్టాలని కోరామన్నారు. వివేక్ కంపెనీల నుంచి స్థానిక వ్యాపారులకు డబ్బులు పంపుతున్నారని మండిపడ్డారు. వివేక్ పాపంలో పాలు పంచుకోవద్దని స్థానిక వ్యాపారులను కోరుతున్నామని తెలిపారు. డబ్బు అహంకారంతో వివేక్ నేతలను హరాజ్ పాటలో కొనుగోలు చేస్తున్నారని అన్నారు.
Bandi Sanjay: అందుకే వద్దని చెప్పా.. కేంద్ర మంత్రి పదవిపై బండి ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!