ఎక్కడ చూసిన ప్రమాదాలు, ప్రయాణం చేయాలంటేనే బెంబేలెత్తున్నారు జనాలు. బయటకు వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చేంత వరకు భరోసాలేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం వాహనాలు నడిపించడం, ఇతర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లో యూటర్న్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో.. 10మందికి గాయాలైన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది.
ఇక వివారాల్లో వెళితే.. నల్గొండ జిల్లా ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు బోల్తాపడింది. వేములపల్లి వద్ద వీ కావేరి ట్రావెల్స్కు చెందిన అదుపు తప్పి బోల్తాపడగా.. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 38 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు.
హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. అయితే, ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?