Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు
- గత కొంతకాలంగా తరచు వివాదాలకు కేరాఫ్ గా నాగార్జునసాగర్ డ్యాం..
- ఆంధ్రప్రదేశ్- తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య జల ఘర్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల మధ్య మళ్లీ జల ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్ రీడింగ్ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు. రైట్ కెనాల్ వద్ద తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. ఇక్కడికి రావద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈవిషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకి తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా.. డ్యామ్ నిర్మాణ సమయం నుండి తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యాం నిర్వాహన బాధ్యతలు చేపడుతుంది. అయితే.. గత కొంతకాలంగా తరచు వివాదాలకు నాగార్జునసాగర్ డ్యాం కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే.. గత ఏడాది (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం జరిగి రచ్చకు దారితీసింది. ఈనేపథ్యలో తెలంగాణలో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించారు. డ్యాం వైపు ఎవరిని అనుమతించలేదు. నోఎంట్రీ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ జల వివాదం తలెత్తడంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలో భాగాంగా పోలీసులు భారీగా మోహరించారు.
Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్’
Also Read
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
- Kalvakuntla Kavitha: ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే.. ఫ్లెక్సీలు తొలగిస్తారా?
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!