Street Dogs Poison: 18 వీధికుక్కల మృతి ఘటనపై కేసు.. చేబ్రోలు పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధికుక్కల బెడద అన్నిచోట్ల వుండేది.. కానీ కొందరు వీధికుక్కలపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. 18 వీధి కుక్కలను పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన వెలుగు చూసింది. దీనిపై కలకలం రేగుతోంది. యానిమల్ యాక్టివిస్ట్ శ్రీలత ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల అనంతరం పోలీసులు కేసులు నమోదు చేశారు. చేబ్రోలు పోలీసులు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం వెలమిల్లికి చెందిన వీరబాబు చేబ్రోలులో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో అవి మృతి చెందాయి. మృతి చెందిన వీధి కుక్కలను ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళుతుండగా జంతు సంరక్షకులైన పావని, శ్రీలత అడ్డుకున్నారు. వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చి ఎందుకు చంపారని వారిని ప్రశ్నించారు. అయితే వీరబాబు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కుక్కల్ని చంపమని ఆదేశించినట్లు చెప్పాడు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి
దీంతో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, ఆదేశాలు జారీచేసిన పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గతంలో వీరబాబు చాలా చోట్ల వీధి కుక్కల్ని చంపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత కోరారు. దీంతో పోలీసులు వీరబాబు తో పాటు చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ కె.స్వామి కేసు నమోదు చేయడంతో పాటు స్థానిక పశువైద్యుడి చేత మృతిచెందిన శునకాలకు పోస్టు మార్టం చేయించారు. గతంలో ఓ వ్యక్తి తన మేకను కుక్క కరిచిందని, 40 వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన.. సంచలనం కలిగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోనూ 200 కుక్కలను చంపి ఓ ఆలయం ఆవరణలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది.
Read ALso: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!