Street Dogs Poison: 18 వీధికుక్కల మృతి ఘటనపై కేసు.. చేబ్రోలు పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వీధికుక్కల బెడద అన్నిచోట్ల వుండేది.. కానీ కొందరు వీధికుక్కలపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. 18 వీధి కుక్కలను పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన వెలుగు చూసింది. దీనిపై కలకలం రేగుతోంది. యానిమల్ యాక్టివిస్ట్ శ్రీలత ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల అనంతరం పోలీసులు కేసులు నమోదు చేశారు. చేబ్రోలు పోలీసులు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం వెలమిల్లికి చెందిన వీరబాబు చేబ్రోలులో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో అవి మృతి చెందాయి. మృతి చెందిన వీధి కుక్కలను ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళుతుండగా జంతు సంరక్షకులైన పావని, శ్రీలత అడ్డుకున్నారు. వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చి ఎందుకు చంపారని వారిని ప్రశ్నించారు. అయితే వీరబాబు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కుక్కల్ని చంపమని ఆదేశించినట్లు చెప్పాడు.
Also Read
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
- Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి
దీంతో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, ఆదేశాలు జారీచేసిన పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గతంలో వీరబాబు చాలా చోట్ల వీధి కుక్కల్ని చంపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత కోరారు. దీంతో పోలీసులు వీరబాబు తో పాటు చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ కె.స్వామి కేసు నమోదు చేయడంతో పాటు స్థానిక పశువైద్యుడి చేత మృతిచెందిన శునకాలకు పోస్టు మార్టం చేయించారు. గతంలో ఓ వ్యక్తి తన మేకను కుక్క కరిచిందని, 40 వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన.. సంచలనం కలిగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోనూ 200 కుక్కలను చంపి ఓ ఆలయం ఆవరణలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది.
Read ALso: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!