Street Dogs Poison: 18 వీధికుక్కల మృతి ఘటనపై కేసు.. చేబ్రోలు పోలీసుల దర్యాప్తు
వీధికుక్కల బెడద అన్నిచోట్ల వుండేది.. కానీ కొందరు వీధికుక్కలపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో చేబ్రోలులో దారుణం చోటుచేసుకుంది. 18 వీధి కుక్కలను పాయిజన్ ఇంజక్షన్లు ఇచ్చి చంపిన ఘటన వెలుగు చూసింది. దీనిపై కలకలం రేగుతోంది. యానిమల్ యాక్టివిస్ట్ శ్రీలత ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన వార్తల అనంతరం పోలీసులు కేసులు నమోదు చేశారు. చేబ్రోలు పోలీసులు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉంగుటూరు మండలం వెలమిల్లికి చెందిన వీరబాబు చేబ్రోలులో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో అవి మృతి చెందాయి. మృతి చెందిన వీధి కుక్కలను ఒక ట్రాక్టర్ లో వేసుకుని వెళుతుండగా జంతు సంరక్షకులైన పావని, శ్రీలత అడ్డుకున్నారు. వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్ ఇచ్చి ఎందుకు చంపారని వారిని ప్రశ్నించారు. అయితే వీరబాబు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ కుక్కల్ని చంపమని ఆదేశించినట్లు చెప్పాడు.
Also Read
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. సమావేశంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆమోదాలు.!
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
Read Also: T20 World Cup: రెండు సార్లు ప్రపంచకప్ విజేత.. అయినా క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడాల్సిన దుస్థితి
దీంతో వీధి కుక్కలకు విషపు ఇంజక్షన్లు ఇచ్చి చంపిన వీరబాబు, ఆదేశాలు జారీచేసిన పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక గతంలో వీరబాబు చాలా చోట్ల వీధి కుక్కల్ని చంపాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని శ్రీలత కోరారు. దీంతో పోలీసులు వీరబాబు తో పాటు చేబ్రోలు పంచాయతీ సర్పంచ్, చేబ్రోలు పంచాయతీ సెక్రటరీ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఐ కె.స్వామి కేసు నమోదు చేయడంతో పాటు స్థానిక పశువైద్యుడి చేత మృతిచెందిన శునకాలకు పోస్టు మార్టం చేయించారు. గతంలో ఓ వ్యక్తి తన మేకను కుక్క కరిచిందని, 40 వీధి కుక్కలను నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఘటన.. సంచలనం కలిగించింది. మెదక్ జిల్లా నర్సాపూర్ లోనూ 200 కుక్కలను చంపి ఓ ఆలయం ఆవరణలో పాతిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది అక్టోబర్ లో ఈ ఘటన జరిగింది.
Read ALso: Karimnagar Bear Migration: మళ్లీ ఎలుగు బంటి కలకలం.. భయాందోళనలో శాతావాహన విద్యార్థులు
తాజావార్తలు
-
Trump: హార్ముజ్పై ట్రంప్ కఠిన నిర్ణయం.. ప్రపంచ దేశాలు ఆందోళన
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
MI vs SRH: వాంఖడేలో హై-స్కోరింగ్ థ్రిల్లర్.. 243 పరుగులు చేసిన ముంబైకి షాకిచ్చిన సన్రైజర్స్
-
Astrology: ఏప్రిల్ 30, గురువారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని శుభవార్తలు..
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?