TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
- ములుగు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..
- నేడు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం..
- ఇవాళ్టి వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు..
- హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. అలాగే, పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందించాలని సైతం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వడం లేదని ఐలమ్మ అనే మహిళ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
కాగా దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ తరఫున లాయర్ డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోస్ట్మార్టం చేసేటప్పుడు బంధువులు ఎవరినైనా అనుమతించాలని తెలిపింది. ఇక, ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలకు నిన్న (సోమవారం) రాత్రి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. అయితే, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే వరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అయినా ఏడు మృతదేహాలను ఫ్రీజర్లలో అధికారులు భద్రపరిచారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!