TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
- ములుగు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..
- నేడు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం..
- ఇవాళ్టి వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు..
- హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. అలాగే, పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందించాలని సైతం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వడం లేదని ఐలమ్మ అనే మహిళ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
కాగా దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ తరఫున లాయర్ డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోస్ట్మార్టం చేసేటప్పుడు బంధువులు ఎవరినైనా అనుమతించాలని తెలిపింది. ఇక, ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలకు నిన్న (సోమవారం) రాత్రి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. అయితే, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే వరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అయినా ఏడు మృతదేహాలను ఫ్రీజర్లలో అధికారులు భద్రపరిచారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
-
INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
-
Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!