TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..
- ములుగు ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి..
- నేడు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం..
- ఇవాళ్టి వరకు మృతదేహాలను భద్రపరచాలని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు..
- హైకోర్టు తీర్పు రాగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగింత..
TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్కౌంటర్లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్ కాల్వల ఐలమ్మకు పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. అలాగే, పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణుల వివరాలను అందించాలని సైతం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వడం లేదని ఐలమ్మ అనే మహిళ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
కాగా దీనిపై జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ తరఫున లాయర్ డి.సురేశ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోస్ట్మార్టం చేసేటప్పుడు బంధువులు ఎవరినైనా అనుమతించాలని తెలిపింది. ఇక, ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలకు నిన్న (సోమవారం) రాత్రి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. అయితే, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే వరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అయినా ఏడు మృతదేహాలను ఫ్రీజర్లలో అధికారులు భద్రపరిచారు.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: “నేనూ చిన్నవాడినే, కానీ అతడితో పోలిస్తే..” వైభవ్పై జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో