Dr K Laxman: సరిపడా టీచర్లను నియమించడం లేదు.. ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్
Dr K Laxman: ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ డా.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషిష్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన “హెల్తీ బేబీ కిట్స్” ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలని ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. పోషకాహార లోపంతో ఎవరూ కూడా ఇబ్బంది పదొద్ధని ప్రతి చిన్న పిల్లలకు అందేలా పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మహిళలు నేడు విమానాలు నడిపే స్థాయికి వచ్చారన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి ప్రేమను పొందిన వ్యక్తి మన మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాని ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read also: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర CSR నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా స్టాఫ్ కు టీచర్స్ కు అవసరమయ్యే ఫర్నిచర్ ను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూలీ చేసుకునే పేదవారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో DSC ద్వారా నియమితులైన టీచర్లు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోప పూరిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లో క్రమేణా పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. రెండు, మూడు వందల పిల్లలు ఉన్న పాఠశాలల్లో కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారన్నారు. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇప్పుడు వారైనా సరిపడా టీచర్లను నియమించి, పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?