Dr K Laxman: సరిపడా టీచర్లను నియమించడం లేదు.. ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ డా.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషిష్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన “హెల్తీ బేబీ కిట్స్” ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలని ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. పోషకాహార లోపంతో ఎవరూ కూడా ఇబ్బంది పదొద్ధని ప్రతి చిన్న పిల్లలకు అందేలా పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మహిళలు నేడు విమానాలు నడిపే స్థాయికి వచ్చారన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి ప్రేమను పొందిన వ్యక్తి మన మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాని ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read also: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర CSR నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా స్టాఫ్ కు టీచర్స్ కు అవసరమయ్యే ఫర్నిచర్ ను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూలీ చేసుకునే పేదవారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో DSC ద్వారా నియమితులైన టీచర్లు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోప పూరిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లో క్రమేణా పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. రెండు, మూడు వందల పిల్లలు ఉన్న పాఠశాలల్లో కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారన్నారు. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇప్పుడు వారైనా సరిపడా టీచర్లను నియమించి, పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!