Dr K Laxman: సరిపడా టీచర్లను నియమించడం లేదు.. ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ డా.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషిష్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన “హెల్తీ బేబీ కిట్స్” ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలని ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. పోషకాహార లోపంతో ఎవరూ కూడా ఇబ్బంది పదొద్ధని ప్రతి చిన్న పిల్లలకు అందేలా పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మహిళలు నేడు విమానాలు నడిపే స్థాయికి వచ్చారన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి ప్రేమను పొందిన వ్యక్తి మన మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాని ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read also: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర CSR నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా స్టాఫ్ కు టీచర్స్ కు అవసరమయ్యే ఫర్నిచర్ ను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూలీ చేసుకునే పేదవారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో DSC ద్వారా నియమితులైన టీచర్లు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోప పూరిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లో క్రమేణా పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. రెండు, మూడు వందల పిల్లలు ఉన్న పాఠశాలల్లో కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారన్నారు. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇప్పుడు వారైనా సరిపడా టీచర్లను నియమించి, పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!
తాజావార్తలు
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!