Dr K Laxman: సరిపడా టీచర్లను నియమించడం లేదు.. ప్రభుత్వంపై లక్ష్మణ్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dr K Laxman: ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని తెలంగాణ ప్రభుత్వంపై ఎంపీ డా.లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కషిష్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన “హెల్తీ బేబీ కిట్స్” ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పిల్లలకు కావాల్సిన పోషకాలు అందాలని ప్రధాని మోడీ ప్రారంభించారన్నారు. పోషకాహార లోపంతో ఎవరూ కూడా ఇబ్బంది పదొద్ధని ప్రతి చిన్న పిల్లలకు అందేలా పంపిణీ చేపట్టామన్నారు. మహిళలకు పెద్ద పీట వేసిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. మహిళలు నేడు విమానాలు నడిపే స్థాయికి వచ్చారన్నారు. ముస్లిం మహిళలకు తల నొప్పిగా ఉన్న ట్రిపుల్ తలాక్ ను రద్దు చేసి వారి ప్రేమను పొందిన వ్యక్తి మన మోడీ అన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుండి మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ప్రధాని ఆదేశాలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
Read also: IPL 2024: డబ్బు కోసమే ఐపీఎల్ ఆడటం సరికాదు.. హార్దిక్ పాండ్యాపై భారత మాజీ పేసర్ ఫైర్!
Also Read
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
- OTR : మంత్రి శ్రీధర్బాబుతో ఎంపీ వంశీకి సెట్ అయిందా?
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదు ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర CSR నిధులతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా స్టాఫ్ కు టీచర్స్ కు అవసరమయ్యే ఫర్నిచర్ ను అందించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లో కూలీ చేసుకునే పేదవారి పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్నరని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో DSC ద్వారా నియమితులైన టీచర్లు నాణ్యమైన విద్య అందించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం సరిపడా టీచర్లను నియమించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ లోప పూరిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల్లో క్రమేణా పిల్లల సంఖ్య తగ్గుతుందన్నారు. రెండు, మూడు వందల పిల్లలు ఉన్న పాఠశాలల్లో కేవలం నలుగురు టీచర్లు మాత్రమే ఉంటున్నారన్నారు. విద్యా వాలంటరీ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఎత్తివేసిందన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిందన్నారు. ఇప్పుడు వారైనా సరిపడా టీచర్లను నియమించి, పాఠశాలలకు కావాల్సిన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.
Viral: తన చిలిపి చేష్టలతో వృద్ధుడికి ముచ్చెమటలు పట్టించిన కోతి..!
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..