Kotha Prabhakar Reddy: నేడు ఐటీ ముందు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotha Prabhakar Reddy: తెలంగాణలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రిజనార్దన్ రెడ్డి.. ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఈ నేపథ్యంలో.. సోదాల అనంతరం ఐటీ విచారణకు రావాల్సిందిగా బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. 84 గంటల పాటు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్లు, ఆన్లైన్ లావాదేవీల ఆధారంగా పైళ్ల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు సంబంధిత వివరాలు, ఆధారాలతో హైదరాబాద్లోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఐటీ అధికారులు సూచించారు. శేఖర్ రెడ్డితో పాటు జానారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇవాళ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి ఐటీ ఎదుట హాజరుకానున్నారు. మర్రి జనార్దన్ రెడ్డి సమయం కోరనున్నారు. గురువారం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి హాజరుకావాలని ఐటీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Read also: Sandeepa Dhar Pics: సందీప ధార్ హాట్ స్టిల్స్.. కుర్రాళ్ల కళ్లన్నీ బ్యూటీపైనే
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 50 బృందాలుగా ఏర్పడిన అధికారులు బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీఆర్ ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గ నేత కొండపల్లి మాధవ్ ఇళ్లపై సోదాలు జరిగాయి. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాల కారణంగా ఈ సోదాలు జరిగినట్లు సమాచారం. అయితే ఒకేసారి ముగ్గురు నేతల ఇళ్లలో ఐటీ దాడులు జరగడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్ల కిందటే బీఆర్ఎస్ నేతలకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించనప్పటికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆందోళనకు దిగారు. వారం రోజుల క్రితం ఓ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నేత ఇళ్లు, సంస్థల్లో ఏకకాలంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
Harsha Missing Case: మల్కాజ్గిరి హర్షవర్ధన్ కిడ్నాప్ కేసు.. కడప వాసి స్కెచ్
తాజావార్తలు
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!