Traffic Challan : ట్రాఫిక్ చలాన్ రూల్స్ మారాయి.. తెలుసా.!
- ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కేంద్రం కఠిన నిర్ణయం
- చలాన్ చెల్లింపు 45 రోజుల్లో తప్పనిసరి
- ఐదు చలాన్ల కంటే ఎక్కువ ఉంటే లైసెన్స్ సస్పెండ్
- వాహనదారులపై బాధ్యత, డిజిటల్ మానిటరింగ్ & నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Challan : రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా పాటిస్తుంటే, ఇకపై కేంద్రం సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చలాన్ల (Traffic Challans) చెల్లింపులో నిర్లక్ష్యం చూపితే తగిన మూల్యం చెల్లించడం తప్పనిసరిగా, లేదంటే వాహనదారులు భారీ శిక్షలు పొందవచ్చు. కేంద్ర రవాణాశాఖ (Ministry of Road Transport & Highways) ఇటీవల సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది.
చలాన్ చెల్లింపు కోసం కొత్త నియమాలు
చెల్లింపు గడువు: ఇప్పటి వరకు 90 రోజులలో చలాన్లు చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి చలాన్ను 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- Minister Tummala: శుభవార్త చెప్పిన మంత్రి తుమ్మల.. రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ..
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
లైసెన్స్ రద్దు: ఒక వాహనంపై ఐదు చలాన్లకు మించి ఉంటే, సంబంధిత అథార్టీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు.
వాహన స్వాధీనం: చలాన్ చెల్లించకపోతే, పోలీసులకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.
లావాదేవీలు నిలిపివేత: చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే, ఆ వాహనంపై అన్ని రవాణా లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే, వాహనం అమ్మకం, కొనుగోలు, లైసెన్స్లో చిరునామా, పేరు మార్పు, రెన్యువల్ ఇలా ఏమీ జరగదు.
డ్రైవింగ్ బాధ్యతపై కొత్త నిబంధనలు
ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం, వాహనం నడిపిన వ్యక్తి అసలు యజమాని కాకపోతే, డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడిగా లెక్కింపబడతారు.
చలాన్ల మానిటరింగ్, నోటీసుల విధానం కేంద్రం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం:
చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలు డిజిటల్ మానిటరింగ్ మరియు ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయబడతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత అధికారులు మూడురోజుల్లో ఇలక్ట్రానిక్ నోటీసు, 15 రోజుల్లో ఫిజికల్ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అదనంగా, ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యంతరాలను పంపవచ్చని (comments-morth@gov.in
) సూచించింది.
ఈ సవరణల ప్రధాన లక్ష్యం వాహనదారులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల మరింత జాగ్రత్త, బాధ్యత పెంపొందించడం. ఇకపై చలాన్లపై నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని కఠిన చర్యలకు లోన చేయడం ద్వారా రహదారుల భద్రతకు కీలకంగా దోహదం అవుతుంది.
తాజావార్తలు
-
West Bengal: మసీదు లౌడ్స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
Raksha Bandhan 2026: రక్షా బంధన్ 2026 ఎప్పుడు..? రాఖీ కట్టేందుకు శుభ ముహూర్తం.. గ్రహణం ప్రభావం ఉంటుందా?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!