Traffic Challan : ట్రాఫిక్ చలాన్ రూల్స్ మారాయి.. తెలుసా.!
- ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కేంద్రం కఠిన నిర్ణయం
- చలాన్ చెల్లింపు 45 రోజుల్లో తప్పనిసరి
- ఐదు చలాన్ల కంటే ఎక్కువ ఉంటే లైసెన్స్ సస్పెండ్
- వాహనదారులపై బాధ్యత, డిజిటల్ మానిటరింగ్ & నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Challan : రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా పాటిస్తుంటే, ఇకపై కేంద్రం సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చలాన్ల (Traffic Challans) చెల్లింపులో నిర్లక్ష్యం చూపితే తగిన మూల్యం చెల్లించడం తప్పనిసరిగా, లేదంటే వాహనదారులు భారీ శిక్షలు పొందవచ్చు. కేంద్ర రవాణాశాఖ (Ministry of Road Transport & Highways) ఇటీవల సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది.
చలాన్ చెల్లింపు కోసం కొత్త నియమాలు
చెల్లింపు గడువు: ఇప్పటి వరకు 90 రోజులలో చలాన్లు చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి చలాన్ను 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
లైసెన్స్ రద్దు: ఒక వాహనంపై ఐదు చలాన్లకు మించి ఉంటే, సంబంధిత అథార్టీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు.
వాహన స్వాధీనం: చలాన్ చెల్లించకపోతే, పోలీసులకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.
లావాదేవీలు నిలిపివేత: చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే, ఆ వాహనంపై అన్ని రవాణా లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే, వాహనం అమ్మకం, కొనుగోలు, లైసెన్స్లో చిరునామా, పేరు మార్పు, రెన్యువల్ ఇలా ఏమీ జరగదు.
డ్రైవింగ్ బాధ్యతపై కొత్త నిబంధనలు
ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం, వాహనం నడిపిన వ్యక్తి అసలు యజమాని కాకపోతే, డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడిగా లెక్కింపబడతారు.
చలాన్ల మానిటరింగ్, నోటీసుల విధానం కేంద్రం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం:
చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలు డిజిటల్ మానిటరింగ్ మరియు ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయబడతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత అధికారులు మూడురోజుల్లో ఇలక్ట్రానిక్ నోటీసు, 15 రోజుల్లో ఫిజికల్ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అదనంగా, ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యంతరాలను పంపవచ్చని (comments-morth@gov.in
) సూచించింది.
ఈ సవరణల ప్రధాన లక్ష్యం వాహనదారులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల మరింత జాగ్రత్త, బాధ్యత పెంపొందించడం. ఇకపై చలాన్లపై నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని కఠిన చర్యలకు లోన చేయడం ద్వారా రహదారుల భద్రతకు కీలకంగా దోహదం అవుతుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!