Traffic Challan : ట్రాఫిక్ చలాన్ రూల్స్ మారాయి.. తెలుసా.!
- ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనపై కేంద్రం కఠిన నిర్ణయం
- చలాన్ చెల్లింపు 45 రోజుల్లో తప్పనిసరి
- ఐదు చలాన్ల కంటే ఎక్కువ ఉంటే లైసెన్స్ సస్పెండ్
- వాహనదారులపై బాధ్యత, డిజిటల్ మానిటరింగ్ & నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Challan : రహదారులపై వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ను విరుద్ధంగా పాటిస్తుంటే, ఇకపై కేంద్రం సీరియస్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా చలాన్ల (Traffic Challans) చెల్లింపులో నిర్లక్ష్యం చూపితే తగిన మూల్యం చెల్లించడం తప్పనిసరిగా, లేదంటే వాహనదారులు భారీ శిక్షలు పొందవచ్చు. కేంద్ర రవాణాశాఖ (Ministry of Road Transport & Highways) ఇటీవల సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989 (Motor Vehicles Act, 1989) లో కీలక సవరణలను ప్రతిపాదించింది.
చలాన్ చెల్లింపు కోసం కొత్త నియమాలు
చెల్లింపు గడువు: ఇప్పటి వరకు 90 రోజులలో చలాన్లు చెల్లించాలి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రతి చలాన్ను 45 రోజుల్లో చెల్లించాల్సి ఉంటుంది.
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
లైసెన్స్ రద్దు: ఒక వాహనంపై ఐదు చలాన్లకు మించి ఉంటే, సంబంధిత అథార్టీ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయవచ్చు.
వాహన స్వాధీనం: చలాన్ చెల్లించకపోతే, పోలీసులకు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ఉంటుంది.
లావాదేవీలు నిలిపివేత: చలాన్ల చెల్లింపు సకాలంలో జరగకపోతే, ఆ వాహనంపై అన్ని రవాణా లావాదేవీలు నిలిపివేయబడతాయి. అంటే, వాహనం అమ్మకం, కొనుగోలు, లైసెన్స్లో చిరునామా, పేరు మార్పు, రెన్యువల్ ఇలా ఏమీ జరగదు.
డ్రైవింగ్ బాధ్యతపై కొత్త నిబంధనలు
ప్రస్తుతం చలాన్లు వాహన యజమాని పేరుతో మాత్రమే జారీ అవుతున్నాయి. అయితే కొత్త రూల్స్ ప్రకారం, వాహనం నడిపిన వ్యక్తి అసలు యజమాని కాకపోతే, డ్రైవింగ్ చేసిన వ్యక్తి బాధ్యుడిగా లెక్కింపబడతారు.
చలాన్ల మానిటరింగ్, నోటీసుల విధానం కేంద్రం ప్రతిపాదించిన డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం:
చలాన్ల జారీ, చెల్లింపు, అప్పీల్ చేయడం వంటి అంశాలు డిజిటల్ మానిటరింగ్ మరియు ఆటోమేషన్ ఆధారంగా వేగవంతం చేయబడతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే, సంబంధిత అధికారులు మూడురోజుల్లో ఇలక్ట్రానిక్ నోటీసు, 15 రోజుల్లో ఫిజికల్ నోటీసును జారీ చేయాల్సి ఉంటుంది.
కేంద్ర రవాణా శాఖ ప్రతిపాదించిన ముసాయిదా నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రహదారి రవాణా మంత్రిత్వశాఖలోని అదనపు కార్యదర్శికి పంపవచ్చని కేంద్రం తెలిపింది. అదనంగా, ఈ-మెయిల్ ద్వారా కూడా అభ్యంతరాలను పంపవచ్చని (comments-morth@gov.in
) సూచించింది.
ఈ సవరణల ప్రధాన లక్ష్యం వాహనదారులలో ట్రాఫిక్ రూల్స్ పట్ల మరింత జాగ్రత్త, బాధ్యత పెంపొందించడం. ఇకపై చలాన్లపై నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని కఠిన చర్యలకు లోన చేయడం ద్వారా రహదారుల భద్రతకు కీలకంగా దోహదం అవుతుంది.
తాజావార్తలు
-
Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
-
Pichi Potta Chicken : నోరూరించే ‘పిచి పొట్టా చికెన్’.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఈజీగా చేసుకోండి.!
-
Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..