MLC Kavitha: అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామన్నారు. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఢిల్లీలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఈడీ నాకు నోటీసులు ఇచ్చింది. దానికి నేను పూర్తీగా సహరిస్తానని అన్నారు. ఈడీ ఎందుకింత హడావిడీగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కావాలంటే నిందితుల్ని ఇంటికి తీసుకొచ్చి విచారించమని కోరా అని అన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని గుర్తు చేశారు. కానీ ఈడీ మా విజ్ఞప్తిని పట్టింఉకోలేదని స్పష్టం చేశారు. ఇది నా ఒక్క సమస్య కాదని, తెలంగాణ నేతల్ని వేధించడం కేంద్రానికి అలవాటైపోయిందని మండిపడ్డారు. అయినా కొన్ని కారణ వల్ల 11న వస్తానని చెప్పానని అన్నారు. అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ విచారణను ఎదుర్కొంటా.. నాతోపాటు ఎవర్ని విచారించినా నాకు ఇబ్బంది లేదన్నారు కవిత.
Read also: Bhatti Vikramarkaa: నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్టా..!
Also Read
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
ఈడీ దర్యాప్తుకు వంద శాతం సహకరిస్తామన్నారు. నాకు భయమెందుకు? నేనేం తప్పు చేయలేదన్నారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికొచ్చి విచారించాలని చట్టం చెబుతోంది.. దర్యాప్తు సంస్థలు మహిళల్ని విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తాం.. ఈడీ ఎందుకింత హడావిడిగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు.. దర్యాప్తును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు చేయరు? అని ప్రశ్నించారు. నిందితులతో కలిపి ప్రశ్నించాలనుకుంటే నన్ను వీడియో కాన్ఫరెన్స్లో విచారించండి అన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది.. మోడీ వైఫల్యాలను కప్పిపుచ్చడానికే ప్రతిపక్షాలపై కేసులు.. మోడీ వన్ నేషన్, వన్ ఫ్రెండ్ అనే కొత్త స్కీమ్ తెచ్చారు.. మోడీ బయటే కాదు, పార్లమెంట్లోనూ అబద్ధాలు చెప్తున్నారు.రేపు జంతర్ మంతర్ దీక్షలో 5 వందల మంది పాల్గొంటారని అన్నారు. 27 ఏళ్లుగా మహిళా బిల్లు కోసం చర్చ జరుగుతోందని, రాజ్యసభలో మహిళా బిల్లు తెచ్చిన సోనియాకు సెల్యూట్.. మహిళా బిల్లును కోల్డ్ స్టోరేజ్లో పడేశారని అన్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద మహిళా బిల్లు కోసం ధర్నా చేస్తున్నామని అధికారంలోకి వస్తే మహిళా బిల్లు తెస్తామని 2014, 2018లో మోడీ మాటిచ్చారని గుర్తు చేశారు.
Minister KTR: కవితకు ఇచ్చింది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లు
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?