MLC Kavitha: కల్వకుంట్ల కాదు.. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవండి
MLC Kavitha: ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో జరిగిన నీటి పారుదల దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం గర్వపడాలన్నారు. సీఎం కేసీఆర్ ఎక్కడ ఎదగాలో.. ఎక్కడ పడాలో తెలిసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కేసీఆర్ అంటే కాల్వలు, చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు అని ఆయన అన్నారు. తక్కువ కాలంలో రాష్ట్ర భవితవ్యాన్ని మార్చే ప్రాజెక్టును నిర్మించిన ముఖ్యమంత్రిని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని కాకుండా కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అని పిలవాలన్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు అని అన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఓ వ్యక్తి కాంగ్రెస్ హయాంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పుడు ఎన్ని నిధులు వచ్చాయో ఆలోచించుకోవాలి ప్రజలకు సూచించారు.
Read also: Telangana Rains: కేరళకు ప్రవేశించనున్న రుతుపవనాలు.. మూడు రోజులు వర్షాలు
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
- KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
కాల్వలు తవ్వి వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో జిల్లా సాగునీటి రంగానికి రూ.5 వేల కోట్లు కేటాయించామన్నారు. పారదర్శక పాలన ఉన్నందున 21 రోజులపాటు ఒక్కో శాఖలో సాధించిన ప్రగతిని వివరించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి కష్టాలు కేసీఆర్ ఎంత కష్టానికి గురయ్యాయో చిన్నప్పుడు తనకు తెలుసని వెల్లడించారు. కాళేశ్వరం వల్ల నిజామాబాద్ జిల్లాకే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. వేసవిలోనూ చెరువులు నిండడం వెనుక కేసీఆర్ కృషి దాగి ఉందన్నారు. కాళేశ్వరం నిర్మాణం అంటే భగీరథ ప్రయత్నమేనన్నారు. జిల్లాలో కాళేశ్వరం ద్వారా లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ఇంత గొప్ప ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంజినీర్ల సంఖ్యను పెంచామని, నీటిపారుదల, ఇంజినీరింగ్ శాఖలను బలోపేతం చేశామన్నారు. అందుకే పనులు వేగంగా జరుగుతున్నాయని, నిజామాబాద్ జిల్లాలో 15 శాతం భూగర్భ జలాలు పెరిగాయని వెల్లడించారు.
Ganja Seller: వెలుగులోకి చీకటి వ్యాపారం.. పానీపూరి చాటున గంజాయి విక్రయం
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!