కేంద్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్….మోదీ సర్కార్ పై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్ వేదికగా కేంద్రాన్ని విమర్శించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. డాలర్ తో పోలిస్తే అత్యంత గరిష్ట స్థాయికి రూపాయి మారకం విలువ చేరడంతో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తీవ్రస్థాయిలో నిరుద్యోగ రేటు పెరిగిందని… 7.83 శాతానికి నిరుద్యోగం చేరిందని విమర్శించారు. గ్యాస్ ధర వెయ్యికి చేరిందని… ఇదేనా మోదీ సర్కార్ మనకు చెప్పిన మంచి రోజులు అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలో అక్కడి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును కూడా ఎండగడుతోంది. రామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ వ్యవహారంపై కూడా టీఆర్ఎస్ పార్టీ ఘాటు విమర్శలు చేసింది. కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎందుకు మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ప్రశ్నించింది. వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే బీజేపీ ఇలాంటి చిల్లర, మతపరమైన రాజకీయాలు చేస్తుందని ఆరోపిస్తోంది. విభజన రాజకీయాలు తప్పితే బీజేపీ ప్రజలకు చేసిందేం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఈ విమర్శలపై బీజేపీ కూడా అంతే స్థాయిలో స్పందిస్తోంది. మైనారిటీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటోందని… ఎంఐఎం పార్టీతో చేరి వారు చెప్పినట్లు నడుచుకుంటోందని విమర్శలు చేస్తున్నారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Tags
- bjp
- Gas Prices
- india
- inflation
- Kavita
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?