MLC Jeevan Reddy: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి.. దేశాన్ని చీకట్లోకి నెట్టారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires On BJP For Rahul Gandhi Disqualification: బీజేపీ, ప్రధాని మోడీలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, దేశాన్ని చీకట్లోకి నెట్టేశారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడంపై జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు కాంగ్రెస్ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. సభ్యత్వం రద్దుతో రాహుల్ గాంధీ గొంతు నొక్కలేరని అన్నారు. ఆర్థిక నేరగాళ్లపై ప్రశ్నిస్తే, రాహుల్ గాంధీపై వేటు వేస్తారా? అని ప్రశ్నించారు.
Minister KTR: నాలుగేళ్లలో ఏం చేశావ్.. బండి సంజయ్పై కేటీఆర్ ధ్వజం
Also Read
- Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
- Banded Krait Snake: వరంగల్ జిల్లాలో డేంజరస్ స్నేక్.. 'బాండెడ్ క్రైట్'గా గుర్తించిన అటవీ అధికారులు!
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Bhadradri Kothagudem: తీవ్ర విషాదం.. వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు ఫారెస్ట్ ఆఫీసర్ బలి!
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుని ప్రజాస్వామ్యంపై దాడిగా జీవన్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేశారని చెప్పారు. ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు.. యావత్ ప్రజాస్వామ్యానికి తీరని మచ్చ అని అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణత్యాగం చేస్తానని చెప్పి, ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని నిలువరించేందుకు ప్రాణత్యాగం చేసిన ఇందిరాగాంధీ అందరికీ ఆదర్శం అన్నారు. ప్రపంచ శాంతి కోసం రాజీవ్ గాంధీ ప్రాణత్యాగం చేశారన్నారు. దేశం కోసం నెహ్రూ కుటుంబం త్యాగం చేసిందని వెల్లడించారు.
Jagadish Reddy: బీఆర్ఎస్ని చూసి.. మోడీ & గ్యాంగ్కు భయం పట్టుకుంది
లండన్లో ఖలిస్తానీ జెండా ఎగురవేస్తే.. ప్రధాని మోడీ ఏం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. పార్లమెంట్లో ప్రశ్నించకుండా రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేసిన మోడీకి.. దేశ ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పబ్లిక్ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడం నిజం కాదా? అని నిలదీశారు. సభ్యత్వం రద్దు చేసి పార్లమెంట్లో నిలువరిస్తారేమో కానీ.. రాహుల్ గాంధీ గొంతును ప్రజల్లోకి తీసుకెళ్లకుండా ఆపడం మీ తరం కాదని తేల్చి చెప్పారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ఓబీసీలకు న్యాయం జరిగిందని తెలియజేశారు.
తాజావార్తలు
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!