Sandra Venkata Veeraiah: కాంగ్రెస్పై ఎమ్మెల్యే సండ్ర ఫైర్.. అప్పుడెందుకు చేయలేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Sandra Venkata Veeraiah Fires On Congress Party: కాంగ్రెస్ పార్టీపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాము అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్.. అంతకుముందే అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితో ఎందుకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీయం బంజర్లో పోడు భూములకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తున్న తరుణంలో, తప్పుడు పద్ధతిలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు వంటి వారు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు.. పోడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు.
DS Chauhan: రోడ్డు ప్రమాదాల్ని తగ్గించాం.. నంబర్ ప్లేట్ లేకపోతే కఠిన చర్యలు తప్పవు
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
గతంలో పోడు సమస్యలను రాజకీయం కోసమో, ఎన్నికల కోసమో వాడుకున్నారని ఎమ్మెల్యే సండ్ర ఆరోపించారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాజకీయ స్వార్ధపరులు, అవకాశవాదులు ముందుకొచ్చి.. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులే కేసీఆర్కు శ్రీరామరక్షగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయ కోణం లేకుండా, మానవీయ కోణంతోనే కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే కాంగ్రెస్ వాళ్లు రూ.4000 పెన్షన్ ఇస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎన్ని రాష్ట్రాల్లో రూ.4000 పెన్షన్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ స్వార్థం లేకుండా.. కులం, మతం లేకుండా.. పేదరికమే గీటు రాయిగా పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ప్రజల్ని కోరారు.
Iran: నకిలీ క్లినిక్ ముసుగులో మహిళలపై అత్యాచారం.. ముగ్గురికి ఉరిశిక్ష అమలు..
తాజావార్తలు
-
RBI MPC 2026: ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!