Komatireddy: కాంగ్రెస్ ఏమైనా సప్లయ్ కంపెనీయా..? కోమటిరెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికార టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, మంత్రి జగదదీష్ రెడ్డిపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంత్రి జగదీష్ రెడ్డికి సవాల్ చేస్తున్నా మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వ పథకాలకు కొబ్బరి కాయలు కొట్టకుండ, అభివృద్ధికి నిధులు తేవాలన్నారు.. అభివృధి అంటే కేసీఆర్ నియోజకవర్గానికి 6 వరసల రోడ్లు కాదు, మా మునుగోడు నియోజకవర్గానికి వేసి చూపించాలన్న ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలు లేకుండా టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని విమర్శించారు.. వేరే పార్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా అభివృధికి అడ్డుపడుతున్నారని మండిపడ్డ ఆయన.. నా నియోజకవర్గంలో కరోనా సమయం లో సుశీలమ్మ ఫౌండేషన్ తరపునా 5 కోట్ల రూపాయల నిత్యావసర సరుకులు పంచానని తెలిపారు.. అసెంబ్లీ సాక్షిగా నేను ప్రభుత్వాన్ని అడిగాను ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూం కాదు తక్షణమే భూమి వున్న వారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.. బంగారు తెలంగాణ చేస్తా అని మద్యం, బెల్ట్ షాపులు పెంచి తాగుబోతుల తెలంగాణ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కొత్తగా దేశాన్ని ఉద్దరిస్తానంటూ ఢిల్లీకి వెళ్తున్న కేసీఆర్ని చూసి అంతా నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు.
Read also: TDP: అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ నిర్ణయం.. చంద్రబాబు మాత్రం రారు..
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇక, రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు చారితాత్మక తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. మూడేళ్లుగా ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేయలేక పోతున్నానని ఫీల్ అవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. అన్నీ ఉండి కూడా మంత్రి జగదీష్ రెడ్డీ .. 57 ఏళ్ల వాళ్లకు పింఛన్లను కూడా ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు.. కానీ, సిగ్గు లేకుండా సన్మానం చేసుకుంటున్నాడని మండిపడ్డారు.. కళ్యాణ లక్ష్మి చెక్కులు సర్పంచ్ ఇస్తే సరిపోదా.. దానికి మంత్రి కావాలా..? అంటూ ఎద్దేవా చేసిన కోటమిరెడ్డి.. సన్మానం చేసినోడికి.. చేయించు కున్నోడికి కూడా సిగ్గులేదన్నారు.. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తికి టికెట్ ఇప్పించి గెలిపిస్తే అమ్ముడు పోయాడని ఆగ్రహం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో జగదీష్ రెడ్డి ఓడిపోతారని జోస్యం చెప్పారు.. మంత్రిగా మునుగోడు అభివృద్ధికి నిధులు తెప్పించు.. నీకు నేనే సన్మానం చేస్తానన్న ఆయన.. అసెంబ్లీలో ఎన్ని సార్లు మాట్లాడిన నిధులు ఇవ్వలేదు కానీ.. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాడు అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఏమైనా సప్లయ్ కంపెనీయా అంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి.. మేం గెలిపించుకంటే… టీఆర్ఎస్ వాళ్లు తీసుకుపోతున్నారని ఫైర్ అయ్యారు.. ఎమ్మెల్యేల నుండి మొదలుకుని… ఎంపీటీసీల వరకు అందరిని కొంటున్నారని విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?