MLA Jogu Ramanna: దేశానికి కేసీఆర్ అవసరం.. మోడీ,ఈడీకి భయపడం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ నేతలపై మండిపడ్డారు ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ మోడీని ప్రశ్నిస్తే ఈడీ నోటీసులు, ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. మోడీ కి ,ఈ డీ కీ భయపడని నేత కేసిఆర్ అన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ లో బీఆర్ ఎస్ లో చేరిక సభలో ఎమ్మెల్యే జోగు రామన్న ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీని విమర్శించే వారిపై సీబీఐ, ఈడీ ల పేరుతో భయభ్రాంతులను గురి చేస్తున్నారు. అలాంటి బెదిరింపులకు తలొగ్గని ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. బీఆర్.ఎస్ పార్టీని ఏర్పాటు చేసి తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వం ప్రస్తుతం భారతదేశానికి ఎంతో అవసరమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. ఇందులో భాగంగానే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ దేశ రాజకీయాల్లో అడుగుపెడుతున్నారని పేర్కొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చించుఘాట్ గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Also Read
Read Also: Drinking Alcohol: కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఆల్కహాల్ తాగేవాళ్లకు అమ్మాయిలను ఇవ్వకండి
ఈ సందర్భంగా చించుఘాట్ కు చెందిన బిజెపి గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి పరశురామ్ తో పాటు రామ్ చందర్ పటేల్ పలువురు గ్రామ యువకులు బీఆర్ఎస్ లో చేరిన నేపథ్యంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ దేశంలో బీజేపీ నాయకులను, నరేంద్ర మోడీని విమర్శించే వారిపై సీబీఐ, ఈడీల పేరుతో భయభ్రాంతులను గురి చేస్తున్నారని అన్నారు. కానీ అలాంటి బెదిరింపులకు తలొగ్గని ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి మద్దత్తు లభిస్తోందని అన్నారు. కేంద్రంలోకి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మతతత్వ రాజకీయాలు పెరిగిపోవడంతో పాటు నిత్యావసర ధరలు ఆకాశానికి పెరిగి ప్రజలను తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజరెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండలం ఎంపీపీ గండ్రత్ రమేష్, వైస్ ఎంపీపీ జంగు పటేల్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కుంర్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ రమేష్,నాయకులు మెట్టు ప్రహ్లాద్, సెవ్వ జగదీష్ యాదవ్, రమణ, కుంర్ర రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
-
Kakanmath Temple: ఈ ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయా? వెయ్యేళ్లుగా చెక్కుచెదరని రహస్యం ఇదేనా?
-
RaviTeja : మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!