Uttam Kumar Reddy: కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతారనే భ్రమలో ఉన్నారు.. ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttamkumar reddy: మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని భ్రమలో ఉన్నారని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా జాన్ పాడ్ దర్గా ఉర్స్ లో ఆయన పాల్గొన్నారు. స్వామివారికి గంధం సమర్పించారు. జాన్ పాడ్ దర్గా ఊర్స్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత పది సంవత్సరాలుగా అభివృధి శూన్యమని తెలిపారు. సాగర్ డ్యాంలో నీరు తక్కువ ఉంది.. ఈసారి వర్షాలు సంవృద్దిగా పడాలని దర్గాలో ప్రార్థనలు చేశా అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టీ.. నిధులు దోచుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మిషన్ భగీరథ పేరుతో డబ్బులు దుర్వినియోగం చేశారన్నారు. మిషన్ భగీరథ సక్సస్ అయితే కృష్ట నది ఒడ్డున ఉన్న గ్రామాలకు తాగు నీరు ఎందుకు రాలేదన్నారు. 25 గంటల కరెంటు అనేది రికార్డ్ ల్లో అంతా బూటకం అనీ తెలిసిందన్నారు. మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతారని భ్రమలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. బై బై కేసీఆర్.. బై బై కేటీఆర్ ఇదే రాసి పెట్టుకోండి అంటూ ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read also: Kanguva: “ఉధిరన్”గా మారనున్న అనిమల్ అబ్రార్…
Also Read
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
- CM Revanth Reddy : నీట్-యూజీ 2026 రద్దు... మోడీ సర్కార్ ఫెయిల్
- TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.7 వేల 500 కోట్లు ఖర్చు చేస్తే ఒక్క ఎకరాకు కూడా నీరు రాలేదన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని, పంటలు పండాలని ఆకాంక్షించారు.గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. గత ప్రభుత్వంలో ఆర్భాటం తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దర్గాకు వచ్చే భక్తుల కోసం కోట్లాది రూపాయలతో అన్ని సౌకర్యాలను అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా 40 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చి కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామాలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందన్నారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వకుండా 90 వేల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. తాగునీటి కోసం సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!