Srinivas Goud: దాడులకు ప్రతిదాడులు ఉంటాయి.. బీజేపీకి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Srinivas Goud Gives Strong Warning BJP Over ED Raids: తెలంగాణలో జరుగుతున్న ఈడీ దాడులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మీద కక్ష్యతోనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈడీ సంస్థ బీజేపీకి అనుబంధంగా పని చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని కేంద్రం భావిస్తోందని ధ్వజమెత్తారు. గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని మీద ఈడీ దాడులు జరుగుతున్నాయన్న శ్రీనివాస్ గౌడ్.. ‘ఇరవై రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, మరి అక్కడ అవినీతి కనిపించడం లేదా?’ అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వని కేంద్రం.. మెడికల్ కాలేజీ పెట్టిన మల్లారెడ్డిపై దాడి చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రశాంతంగా ఉంది కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా మోడీ నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్ట్కి నిదులు ఇస్తామని చెప్పిన మోడీ.. మాట తప్పారన్నారు. ముంబై, గోవాల్లో ఉన్న క్యాసినోలను మూసివేయాలని మోడీని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని.. అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని.. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. మత పిచ్చితో దేశంలో అభివృద్ధి చేయకుండా.. దేశాన్ని ఆగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈడీ దాడులతో తెలంగాణ ప్రజలు భయపడరని, ఈ దాడులకి ప్రతిదాడులు కచ్ఛితంగా ఉంటాయని హెచ్చరించారు.
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
తెలంగాణ అన్ని రాష్ట్రాలకు భిన్నమని.. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా తెలంగాణ నష్టపోవాలని కేంద్రం భావిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని.. ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!