Srinivas Goud: దాడులకు ప్రతిదాడులు ఉంటాయి.. బీజేపీకి వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Srinivas Goud Gives Strong Warning BJP Over ED Raids: తెలంగాణలో జరుగుతున్న ఈడీ దాడులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మీద కక్ష్యతోనే బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. ఈడీ సంస్థ బీజేపీకి అనుబంధంగా పని చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని కేంద్రం భావిస్తోందని ధ్వజమెత్తారు. గంగుల కమలాకర్, మల్లారెడ్డి, తలసాని మీద ఈడీ దాడులు జరుగుతున్నాయన్న శ్రీనివాస్ గౌడ్.. ‘ఇరవై రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, మరి అక్కడ అవినీతి కనిపించడం లేదా?’ అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వని కేంద్రం.. మెడికల్ కాలేజీ పెట్టిన మల్లారెడ్డిపై దాడి చేస్తుందని మండిపడ్డారు.
తెలంగాణ ప్రశాంతంగా ఉంది కాబట్టే వేల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు అదనంగా మోడీ నిధులు ఇవ్వడం లేదని నిలదీశారు. పాలమూరు ప్రాజెక్ట్కి నిదులు ఇస్తామని చెప్పిన మోడీ.. మాట తప్పారన్నారు. ముంబై, గోవాల్లో ఉన్న క్యాసినోలను మూసివేయాలని మోడీని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని.. అందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని.. విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. మత పిచ్చితో దేశంలో అభివృద్ధి చేయకుండా.. దేశాన్ని ఆగం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. ఈడీ దాడులతో తెలంగాణ ప్రజలు భయపడరని, ఈ దాడులకి ప్రతిదాడులు కచ్ఛితంగా ఉంటాయని హెచ్చరించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
తెలంగాణ అన్ని రాష్ట్రాలకు భిన్నమని.. తెలంగాణతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా తెలంగాణ నష్టపోవాలని కేంద్రం భావిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని.. ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!