Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singireddy Niranjan Reddy: కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల బహిరంగసభలో కాంగ్రెస్ నేతల విమర్శలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలో అన్నీ పెండింగే అంటూ ధ్వజమెత్తారు. నీళ్లు, నిధులు, కరంటు,ఫించన్, పాలన,ప్రజల సమస్యలు అన్నీ పెండింగ్ కు పర్యాయపదం కాంగ్రెస్ అంటూ ఆరోపించారు. నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే పాలమూరు వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వారు ఏ మొకం పెట్టుకుని పాలమూరు ప్రజలను ఓట్లు అడుగుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడు దక్కుతుందా అని కాంగ్రెస్ నేతలు కళ్లలో వత్తులు వేసుకుని చూస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కానీ 5 దశాబ్దాల అధికారంతోనే కదా అధోగతి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరుకు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో కళ్ల ముందు కనిపిస్తుందని తెలిపింది.
నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన చూసి 2018లో ఉమ్మడి పాలమూరులో 14కు 13 స్థానాల్లో ప్రజలు పట్టంకట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పాలకుల సామర్ద్యానికి గీటురాయన్నారు. అయిదు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ నేతలు జీవితకాలం ఊడిగం చేసినా వారి పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పాలమూరు జిల్లాలో స్థానం లేదు, వారి పొలిటికల్ డ్రామాలు ఇక్కడ పండవని ఎద్దేవ చేశారు. కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్ నేతలు పగటికలలు కంటున్నారని తెలిపారు. అక్కడ ప్రత్యామ్నాయం లేక ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారని అన్నారు. అక్కడ అధికారం రాగానే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఆశలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో ఒకరిపై ఒకరుపై చేయి సాధించే పవర్ కోసమే వారి పాదయాత్రలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అందరూ కట్టప్పలే.. పాలమూరు ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి, పోతిరెడ్డిపాడుతో వెన్నుపోటు పొడిచి, పాలమూరు ప్రజలను వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యల పాలు చేశారని మండిపడ్డారు.
Also Read
- HYDRAA : శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద హైడ్రా యాక్షన్.. అక్రమ కట్టడాల కూల్చివేత.!
- Kavitha Arrest : రోడ్డుపై ధాన్యం పోసి నిరసన.. కవిత అరెస్ట్
- Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
- KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల మీద కేసులు వేసి అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టు ఎందుకు ఆలస్యం అయ్యిందనడం ఆశ్చర్యకరమన్నారు. 9 ఏళ్లలో పాలమూరు వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందని అన్నారు. నడి ఎండాకాలంలో చెరువుల్లో ఉన్న నీరే కాంగ్రెస్ నేతల ప్రశ్నలకు సమాధానమన్నారు. నాడు మీ పాలనలో అంబలికేంద్రాలు, గంజి కేంద్రాలు ఉండేవి .. నేడు ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అన్నారు. నాడు మీ పాలనలో గ్రామాల్లో సాగునీరే కాదు తాగునీటికీ ఇబ్బందులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. అధికారం మీద కాంగ్రెస్ దింపుడుకళ్లెం ఆశతో ఉందని తెలిపారు. ఈ సారి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మాదిరే అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు నోటి కొచ్చినట్లు మాట్లాడడం మాని మీ పాలనలో జరిగిన అన్యాయాలకు పాలమూరు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని సూచించారు. 1946 – 51 మధ్యకాలంలో, 1969 తెలంగాణ ఉద్యమంలో, మలిదశ (2001 – 2014) తెలంగాణ ఉద్యమంలో యువకుల కాల్చివేత, అమరత్వం, కాంగ్రెస్ పార్టీని ఎల్లకాలం పట్టి పీడిస్తుందని అన్నారు.
BIG Breking: ఆలయంలో అపచారం.. దేవుని విగ్రహాలకు అభిషేకం చేస్తుండగా ఈతకొట్టిన ఈవో
తాజావార్తలు
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Supreme Court: ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ 8వ తరగతి పాఠంపై సుప్రీంకోర్టు యూటర్న్.. తాజా ఆదేశాలివే!
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!