Minister Malla Reddy: ఇది మా కుటుంబ సమస్య.. మేం పరిష్కరించుకుంటాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు.. మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మె్ల్యేలు అసమ్మతి గళం ఎత్తారు. మంత్రికి వ్యతిరేకంగా సమావేశమైన ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి.. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు.. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు మల్లారెడ్డి అంశాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిచింది.. అయితే, ఎమ్మెల్యే సమావేశంపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. ఇది మా కుటుంబ సమస్య.. మాకు కుటుంబ పెద్దలు ఉన్నారు.. మేమే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు..
Read Also: Harish Rao: సడెన్ ట్విస్ట్ ఇచ్చిన హరీశ్ రావు.. రైల్వే శాఖపై అసహనం
Also Read
- Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
మాది క్రమశిక్షణ గల పార్టీ అని మీడియా చిట్చాట్లో వ్యాఖ్యానించారు మంత్రి మల్లారెడ్డి… ఇది ఇంటి సమస్య.. పరిష్కరించుకుంటామన్న ఆయన.. నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకునే రకం కాదన్నారు.. మా మధ్య అంతా సమస్య లేదన్న ఆయన.. నేనే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తాను.. అవసరం అయితే, వారితో మాట్లాడతానని తెలిపారు.. ఇక, నేను గాంధేయవాదిని.. మా ఇంటి సమస్యను ఎక్కువగా చేసి చూపిస్తున్నారని వాపోయిన ఆయన.. అయినా, పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇస్తారు.. నేను కాదు అని స్పష్టం చేశారు.. కుదిరితే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్తా.. అవసరమైతే ఎమ్మెల్యేలను అందరినీ మా ఇంటికి ఆహ్వానిస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి.. కాగా, మంత్రి మల్లారెడ్డి కారణంగా మేడ్చల్ జిల్లాలోని పదవులన్నీ మేడ్చల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ విషయం కేటీఆర్ వరకు వెళ్లింది.. కానీ, రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించారంటూ ఎమ్మెల్యే మైనంపల్లి ఆరోపిస్తున్నారు.. మల్లారెడ్డి అవకాశం ఇచ్చిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ పదవులు కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.. అయితే, మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు సమావేశం కావడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
-
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
-
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల ముహూర్తం ఖారారు..
-
ACB Raid: భూమి మ్యుటేషన్ కోసం లంచం అవతారం.. ఏసీబీ వలలో వీఆర్వో..
-
Sonia Gandhi: సోనియా గాంధీ ఓటర్ లిస్ట్ కేసులో కీలక పరిణామం
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!