తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు మరో భారీ సంస్థ ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారిగా విమాన ఇంజన్ల మరమ్మతు కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. అయితే.. ఫ్రాన్స్ కు చెందిన సాఫ్రాన్ సంస్థ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న విమాన ఇంజన్ల తయారీ యూనిట్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. విమానయాన రంగ ఉత్పత్తులను తయారు చేస్తున్న సాఫ్రాన్.. మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హోల్ కేంద్రాన్ని రూ. 1200 కోట్ల రూపాయల పెట్టుబడులు సాఫ్రాన్ ఏర్పాటు చేస్తోంది.
ఇందులో విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతు నిర్వహిస్తారు. ఇండియాలో ఒక విదేశీ సంస్థ పెడుతున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం ఇదే కావడం విశేషం. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తిచేసే దిగ్గజ కంపెనీల్లో ఒకటి సాఫ్రాన్. అయితే దీనిని కాసేపట్లో తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.