Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం జ్ఞానవాపి మసీదు పై వారణాసి కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. మసీదును సర్వే చేయాలని తీర్పు వెల్లడించింది. దీనికి కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించారు. మసీదు లోపలి భాగాలను సర్వే చేయాలని కోర్ట్ ఆదేశించింది. పూర్తిగా వీడియోగ్రఫీ చేసి మే 17 వరకు నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ఓ వర్గం వారు వీడియోగ్రఫీని ఆపాలని పిటిషన్ వేయగా… కోర్ట్ మాత్రం సర్వేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం వారు మసీదులో సర్వే చేయడాన్ని వ్యతిరేఖిస్తుండగా… మరో వర్గం వారు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని.. ఇప్పటికీ మసీదులో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని.. తమకు ఆ మసీదును అప్పగించాలని కోరతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ట్ వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మొగల్ చక్రవర్తుల పాలన సమయంలో ఔరంగబేబు జ్ఞానవాపి ఆలయాన్ని మసీదుగా మార్చారని వాదనలు ఉన్నాయి. అయితే ఇందుకు నిజం చేకూర్చే విధంగా మసీదు వెనకభాగంలో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నట్లుగా మరోవర్గం వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే బాబ్రీని కోల్పోయాం…మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. వారణాసి కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా ఉందని విమర్శించారు. యోగీ ఆదిత్య నాథ్, బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
-
Food poisoning: బిర్యానీ, వాటర్మిలన్ కలిపి తింటే ప్రమాదమా..? శరీరంలో ఏం జరుగుతుంది?
-
Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
-
Gudivada Amarnath: డేటా సెంటర్పై మాజీ మంత్రి ఫైర్.. పలు అంశాలపై సూటి ప్రశ్నలు.!
-
Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో