Gyanvapi mosque survey: జ్ఞానవాపీ మసీదు సర్వే… వారణాసిలో భద్రత కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు వివాదంపై చర్చ జరుగుతోంది. వారణాసి కోర్ట్ దేశాలతో ఈ రోజు కోర్ట్ కమిషనర్ టీం జ్ఞానవాపి మసీదును వీడియోగ్రఫీ చేయనున్నారు. దీంతో వారణాసి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. మసీదు పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మసీదుకు చుట్టూ 500 మీటర్ల వరకు ఉన్న అన్ని దుకాణాలను మూసివేయబడ్డాయి. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం జ్ఞానవాపి మసీదు పై వారణాసి కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. మసీదును సర్వే చేయాలని తీర్పు వెల్లడించింది. దీనికి కోర్ట్ కమిషనర్ అజయ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయవాదులను కమిషనర్లుగా నియమించారు. మసీదు లోపలి భాగాలను సర్వే చేయాలని కోర్ట్ ఆదేశించింది. పూర్తిగా వీడియోగ్రఫీ చేసి మే 17 వరకు నివేదిక ఇవ్వాలని కోర్ట్ ఆదేశించింది. ఓ వర్గం వారు వీడియోగ్రఫీని ఆపాలని పిటిషన్ వేయగా… కోర్ట్ మాత్రం సర్వేకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ వర్గం వారు మసీదులో సర్వే చేయడాన్ని వ్యతిరేఖిస్తుండగా… మరో వర్గం వారు ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారని.. ఇప్పటికీ మసీదులో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయని.. తమకు ఆ మసీదును అప్పగించాలని కోరతున్నారు. ఈ నేపథ్యంలో కోర్ట్ వీడియోగ్రఫీకి అనుమతి ఇవ్వడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మొగల్ చక్రవర్తుల పాలన సమయంలో ఔరంగబేబు జ్ఞానవాపి ఆలయాన్ని మసీదుగా మార్చారని వాదనలు ఉన్నాయి. అయితే ఇందుకు నిజం చేకూర్చే విధంగా మసీదు వెనకభాగంలో కొన్ని దేవతా విగ్రహాలు ఉన్నట్లుగా మరోవర్గం వారు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జ్ఞానవాపి మసీదు సర్వేపై ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే బాబ్రీని కోల్పోయాం…మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేమని అన్నారు. వారణాసి కోర్ట్ తీర్పు సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా ఉందని విమర్శించారు. యోగీ ఆదిత్య నాథ్, బీజేపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!