KTR: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైఎస్ షర్మిల పార్టీయే ప్రధాన ప్రతిపక్షం కావొచ్చు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.. తెలంగాణలో పాదయాత్రలు, దీక్షలు, ధర్నాలతో దూసుకెళ్తున్నారు వైఎస్ షర్మిల.. ఏ అవకాశం దొరికినా ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. పాదయాత్రలో వివిధ వర్గాల ప్రజలను కలుస్తూ.. తెలంగాణలో రాజన్న రాజ్యం రాబోతోంది.. అందరికీ న్యాయం జరుగుతుందంటూ ముందుకు సాగుతున్నారు. అయితే, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురుకాబోతోంది అంటూ.. మంత్రి కేటీఆర్కు ప్రశ్న ఎదురైంది.. దీనికి బదులిచ్చిన ఆయన.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. వైఎస్ షర్మిల పార్టీ.. వైఎస్ఆర్టీపీయే ప్రధాన ప్రతిపక్షంగా మారొచ్చు అని వ్యాఖ్యానించారు.
Read Also: Weather Update : తెలంగాణవాసులకు కూల్న్యూస్.. మరో 4రోజులు వర్షాలు..
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
కాగా, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే త్రిముఖ పోటీ తప్పదంటున్నారు విశ్లేషకులు.. అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని భావిస్తున్న గులాబీ పార్టీ బాస్ కేసీఆర్.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే విధంగా ప్రణాళికులు వేశారని.. అందులో భాగంగానే బీజేపీ, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. కాంగ్రెస్ నేతలను సైడ్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా.. తాము చేసిన అభివృద్ధి, కట్టిన ప్రాజెక్టులు.. సంక్షేమ పథకాలు మరోసారి తమను అధికారంలోకి తెస్తాయనే నమ్మకంతో ఉంది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని.. దేశవ్యాప్తంగా తెలంగాణపై చర్చ సాగుతుందంటున్నారు. అంతేకాదు.. జాతీయ రాజకీయాల్లోనూ సత్తా చాటాలని ఆ పార్టీ భావిస్తోంది.. కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ పథకాలను కాపీ కొట్టే మోడీ సర్కార్ అమలు చేస్తోందంటున్నారు ఆ పార్టీ నేతలు.
- Tags
- cm kcr
- ktr
- Minister KTR
- telangana
- TRS
తాజావార్తలు
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!