KTR: లిక్విడ్ వేస్ట్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్నగర్లోని డంప్యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది. భూగర్భ జలాలు, చెరువులు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నిర్వహణలో జీహెచ్ఎంసీ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్నగర్లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2 వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు 4 వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటికే వృథా నీటితో నిండిన మలారం చెరువులో దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అంతేకాకుండా ఈ చెరువులోని వృథా నీరు పొంగిపోకుండా దాదాపు 4 కోట్ల 35 లక్షలతో తుపాను నీటి మళ్లింపు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్నగర్ డంప్యార్డు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీహెచ్ఎంసీ 2020 నాటికి క్యాపింగ్ పనులను పూర్తి చేసింది.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
కలుషిత వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసేందుకు సమగ్ర పరిష్కారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ.. 2020లో దాదాపు రూ.250 కోట్లతో జవహర్నగర్ డంప్యార్డులో మురుగునీటి శుద్ధి, కృత్రిమ నీటి గుంతల పునరుద్ధరణ, శుద్ధీకరణ పనులను రాంకీ కంపెనీ చేపట్టింది. మలారం చెరువుతో పాటు ఏడాది కాలంగా జరుగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43శాతం మలారం చెరువును శుద్ధి చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కాలుష్య నియంత్రణ మండలి వంటి ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నీటిని జీహెచ్ఎంసీ ఇప్పటికే శుద్ధి చేసింది. పేరుకుపోయిన మురికిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. త్వరలో మల్కారం చెరువు జలాలను శుద్ధి చేస్తామన్నారు. పనులు పూర్తయితే జవహర్నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు, కలుషిత నీటి సమస్య పూర్తిగా అరికట్టబడుతుంది.
Uttam Kumar: తిమ్మారెడ్డిగూడెం ఘటన.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి లేదంటే దీక్ష చేస్తాం
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!