KTR: లిక్విడ్ వేస్ట్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్నగర్లోని డంప్యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది. భూగర్భ జలాలు, చెరువులు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నిర్వహణలో జీహెచ్ఎంసీ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్నగర్లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2 వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు 4 వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటికే వృథా నీటితో నిండిన మలారం చెరువులో దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అంతేకాకుండా ఈ చెరువులోని వృథా నీరు పొంగిపోకుండా దాదాపు 4 కోట్ల 35 లక్షలతో తుపాను నీటి మళ్లింపు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్నగర్ డంప్యార్డు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీహెచ్ఎంసీ 2020 నాటికి క్యాపింగ్ పనులను పూర్తి చేసింది.
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
కలుషిత వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసేందుకు సమగ్ర పరిష్కారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ.. 2020లో దాదాపు రూ.250 కోట్లతో జవహర్నగర్ డంప్యార్డులో మురుగునీటి శుద్ధి, కృత్రిమ నీటి గుంతల పునరుద్ధరణ, శుద్ధీకరణ పనులను రాంకీ కంపెనీ చేపట్టింది. మలారం చెరువుతో పాటు ఏడాది కాలంగా జరుగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43శాతం మలారం చెరువును శుద్ధి చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కాలుష్య నియంత్రణ మండలి వంటి ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నీటిని జీహెచ్ఎంసీ ఇప్పటికే శుద్ధి చేసింది. పేరుకుపోయిన మురికిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. త్వరలో మల్కారం చెరువు జలాలను శుద్ధి చేస్తామన్నారు. పనులు పూర్తయితే జవహర్నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు, కలుషిత నీటి సమస్య పూర్తిగా అరికట్టబడుతుంది.
Uttam Kumar: తిమ్మారెడ్డిగూడెం ఘటన.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి లేదంటే దీక్ష చేస్తాం
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..