KTR: లిక్విడ్ వేస్ట్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
KTR: హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్నగర్లోని డంప్యార్డుకు తరలిస్తుంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ చెత్తాచెదారం నిల్వ ఉండడంతో చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది. భూగర్భ జలాలు, చెరువులు కలుషితం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త నిర్వహణలో జీహెచ్ఎంసీ ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది. పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుద్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్నగర్లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2 వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు 4 వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటికే వృథా నీటితో నిండిన మలారం చెరువులో దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అంతేకాకుండా ఈ చెరువులోని వృథా నీరు పొంగిపోకుండా దాదాపు 4 కోట్ల 35 లక్షలతో తుపాను నీటి మళ్లింపు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్నగర్ డంప్యార్డు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీహెచ్ఎంసీ 2020 నాటికి క్యాపింగ్ పనులను పూర్తి చేసింది.
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
కలుషిత వ్యర్థ జలాలను పూర్తిగా శుద్ధి చేసేందుకు సమగ్ర పరిష్కారాన్ని సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ.. 2020లో దాదాపు రూ.250 కోట్లతో జవహర్నగర్ డంప్యార్డులో మురుగునీటి శుద్ధి, కృత్రిమ నీటి గుంతల పునరుద్ధరణ, శుద్ధీకరణ పనులను రాంకీ కంపెనీ చేపట్టింది. మలారం చెరువుతో పాటు ఏడాది కాలంగా జరుగుతున్న పనుల్లో భాగంగా ఇప్పటికే 43శాతం మలారం చెరువును శుద్ధి చేశారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కాలుష్య నియంత్రణ మండలి వంటి ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. మొదటి దశలో భాగంగా 5.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు నీటిని జీహెచ్ఎంసీ ఇప్పటికే శుద్ధి చేసింది. పేరుకుపోయిన మురికిని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. త్వరలో మల్కారం చెరువు జలాలను శుద్ధి చేస్తామన్నారు. పనులు పూర్తయితే జవహర్నగర్, పరిసర ప్రాంతాల్లో ఘన వ్యర్థాలు, కలుషిత నీటి సమస్య పూర్తిగా అరికట్టబడుతుంది.
Uttam Kumar: తిమ్మారెడ్డిగూడెం ఘటన.. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలి లేదంటే దీక్ష చేస్తాం
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!