సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ పెట్టుబడులను రాబట్టడంలో సఫలం అవుతోంది.. ప్రభుత్వ విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది.. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖకు సంబంధించిన అధికారులు విదేశాల్లో పర్యటించి మరీ.. వివిధ కంపెనీలను ఆహ్వానించడంతో.. భారీగా పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి.. తాజాగా మరో భారీ పెట్టబడి హైదరాబాద్కు రాబోతోంది.. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది.. ఆ కంపెనీ నిర్ణయాన్ని స్వాగతించిన మంత్రి కె. తారక రామారావు… హర్షం వ్యక్తం చేశారు..
Read Also: Trendy Beggar: ట్రెండ్ మారింది గురూ..! ఈ బిచ్చగాడిని చూస్తే ఔరా అనాల్సిందే..!
సాఫ్రాన్ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు మంత్రి కేటీఆర్.. హైదరాబాద్లో మెగా ఏరో ఇంజిన్ ఎంఆర్వో ఏర్పాటుకు సాఫ్రాన్ నిర్ణయించిందన్న ఆయన.. హైదరాబాద్లో సాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్వో ప్రపంచంలోనే పెద్దదని పేర్కొన్నారు.. ఇక, ఓ ప్రపంచ స్థాయి సంస్థ భారత్లో ఏర్పాటు చేసే మొదటి ఇంజిన్ ఎంఆర్వో ఇదేనని.. ఎంఆర్వో, ఇంజిన్ టెస్ట్ సెల్ పెట్టుబడి 150 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 1,200 కోట్లు అని వెల్లడించారు.. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రంలో 800 నుంచి 1000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు కేటీఆర్.. ఇది భారతీయ మరియు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థలు ఉపయోగించే మార్కెట్ లీడింగ్ లీప్ 1ఏ మరియు లీప్ 1బీ ఏరో ఇంజిన్లకు సేవలు అందించనుంది.. ఈ ఇంజిన్ ఎంఆర్వో ప్రాజెక్ట్ తెలంగాణలోని స్థానిక ఏరోస్పేస్ తయారీ మరియు ఏవియేషన్ పర్యావరణ వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నాం.. ఈ పెట్టుబడితో, హైదరాబాద్ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన ఏరోస్పేస్ వ్యాలీకి దోహదపడుతుందని ఎరోస్పేస్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ మారబోతుందని తన ట్వీట్లో రాసుకొచ్చారు.
Jubilant to welcome @SAFRAN group’s decision to select Hyderabad for its Mega Aero Engine MRO in India
This will be SAFRAN’s largest MRO globally and will be the first Engine MRO established by a global OEM in India pic.twitter.com/gzYdfe4SB3— KTR (@KTRBRS) July 6, 2022