కాంగ్రెస్, బీజేపీ నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలి.. కేటీఆర్ పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్, బీజేపీ నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారు.. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. నకిరేకల్లో నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణలో కడుతున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చిందా..? అని ప్రశ్నించారు.. కానీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తూ ప్రగతి పథంలో నడిపిస్తున్న నాయకుడు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి అని ప్రశ్నించారు.. ఈనాడు తెలంగాణ లో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు.. సీఎం కేసీఆర్ చేపట్టిన రైతు బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్న ఆయన.. ఈ వానాకాలం సీజన్లో కూడా రైతు బంధు సాయం చేస్తున్నారు సీఎం కేసీఆర్ అని గుర్తుచేశారు.. ఇప్పటి వరకు అన్ని సీజన్లలో కలిపి 50 వేల కోట్ల రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించిన ఆయన.. సమైక్యాంధ్ర పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. కానీ, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా అల్ టైం హై దిగుబడులు సాధించి గొప్ప పెరును సంపాందించింది.. తెలంగాణకే నల్గొండ జిల్లా దిక్కూచిగా నిలిచిందని తెలిపారు..
ఇక, ఎఫ్సీఐ లెక్కల్లో దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్నరాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సాధించిందన్నారు మంత్రి కేటీఆర్.. గతంలో 30 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి పండించేవారు.. ఇప్పుడు కోటి ఆరు లక్షల ఎకరాల్లో వరి పండుతుంది.. ఇది మన ఘనత అన్నారు.. రైతుకు పెట్టుబడి సాయం చేయాలని దేశంలో ఏ నాయకునికి కనీస ఆలోచన రాలేదన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్ నాయకత్వం లో వ్యవసాయం పండుగలా మారిందని.. రైతులు సంఘటితం కావాలని, బాగు పడాలని రైతు వేదికలను నిర్మించారని.. రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.. పండించిన ప్రతి గింజను కొంటున్న ప్రభుత్వం ఏదన్నా ఉందా అని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసిందని.. ఇది అంతా గమనించాలన్నారు.. ఇక, నకేరేకల్ లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న ఆయన.. మున్సిపల్, ఎమ్మార్వో కార్యాలయల నిర్మాణానికి కృషి చేస్తాం.. ఉదయ సముద్రం ప్రాజెక్ట్ పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రకటించారు.
Also Read
- Tags
- bjp
- congress
- ktr
- Minister KTR
- Nakrekal
తాజావార్తలు
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!