Minister Komatireddy: నేడు కలెక్టర్లతో మంత్రి కోమటి రెడ్డి సమావేశం.. రోడ్ల మరమ్మతులపై చర్చ
- నేడు సెక్రటేరియట్ లో పలువురు కలెక్టర్లతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం..
- త్రిబుల్ ఆర్ భూసేకరణ వంటి అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Komatireddy: నేడు సెక్రటేరియట్ లో పలువురు కలెక్టర్లతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, త్రిబుల్ ఆర్ భూసేకరణ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా.. మంత్రి కోమటిరెడ్డి నిన్న తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారులు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రోడ్లు, సిఆర్ఐఎఫ్ రోడ్లు, పనుల పురోగతులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ ను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చారన్నారు. మూడున్నర ఏళ్లలో RRR పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. వర్షాకాలం ప్రారంభం అయ్యేలోపు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు మరమ్మత్తులు చేయాలని అదేశించామని వెల్లడించారు. విజయవాడ రోడ్డు అనగానే డెత్ రోడ్డు అనే పేరు ఉందన్నారు. డిసెంబర్ లోపు సిక్స్ లైన్ రోడ్డు పనులను మొదలు పెట్టుకోవాలని టార్గెట్ పెట్టుకున్నామని తెలిపారు. నేటి నుంచి ఫుల్ టైం యాక్షన్ లోకి దిగుదామని, కేంద్రం నుంచి నిధులు తెస్తామన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
Read also: Balkampet Yellamma: జూలై 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. 81 రోజుల హుండీ ఆదాయం ఎంతంటే..
తెలంగాణలో ఎక్కువశాతం రోడ్లను జాతీయ రహదారులుగా మార్చేందుకు కృషి చేస్తామని మంత్రి అన్నారు. పార్లమెంట్ లో ఇండియా కూటమి బలం ఉందని తెలిపారు. కేంద్రంపై ఒత్తిది చేస్తామని అన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్, కొంపల్లి ఫ్లైఓవర్, అంబర్ పేట పనులు ఏళ్ల తరబడి జరుగుతున్నాయని అన్నారు. మూడు నెలల్లో అంబర్ పేట పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేశామన్నారు. తెలంగాణ భవనం ఢిల్లీలో 24 అంతస్తుల నిర్మించడం కూడా జరుగుతుందన్నారు. డీపీఆర్ రెడీ అవుతుందని తెలిపారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేటీఆర్ కేవలం సెల్ఫీ కోసమే పనికొస్తుందన్నారు.
ఒక గంట అక్కడ ఉంటే హాస్పటల్ పాలు అవ్వడం ఖాయమన్నారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ టు బెంగుళూర్ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు 5600 కోట్లతో రోడ్డు సాధిస్తామన్నారు. బకాయిలు అనేది పెద్ద సమస్య, పెద్ద రాష్ట్రం తెలంగాణ అన్నారు. బకాయిలు తీర్చడానికి కార్పొరేషన్ పెట్టీ ముందుకు వెళ్తామన్నారు. కేసీఆర్ మోడీతో వ్యక్తిగత పంచాయితీ ఉన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. అక్టోబర్ లో ఫౌండేషన్, డిసెంబర్ లోపు ఆర్ఆర్ఆర్ ప్రారంభించాలని అనుకుంటున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యశాఖతో కలిసి మరోసారి సమీక్ష చేస్తామన్నారు.
Plane Crash: విమానానికి తప్పిన ప్రమాదం.. ఇంజిన్ లో మంటలు..
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..