Eknath Shinde: మాకు వీటిలో ఓ గుర్తు కేటాయించండి.. ఈసీకి ఏక్నాథ్ షిండే వర్గం విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు జెండా ఎగురవేసి.. అందినకాడికి ఎమ్మెల్యేలను లాక్కెళ్లిన ఏక్నాథ్ సిండే.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.. శివసేనలో రెబల్ వర్గంగా కొనసాగుతున్నారు.. తమదే అసలైన శివసేన అంటున్నారు.. అయితే, అంధేరి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో.. ఇప్పుడు ఎన్నికల గుర్తులు తెరపైకి వచ్చాయి.. ఇప్పటికే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం తమ ఆప్షన్లను ఈసీకి సమర్పించింది. మూడు గుర్తులు ఎంచుకుంది.. త్రిశూలం, ఉదయించే సూర్యుడు, కాగడా గుర్తులను ఈసీకి సమర్పించిన థక్రే వర్గం.. ఇక, శివసేన (బాలాసాహెబ్ ఠాక్రే), శివసేన (ప్రబోధంకర్ ఠాక్రే), శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) లాంటి పేర్లను కూడా పార్టీకి సూచించింది.. పై మూడు గుర్తుల్లో ఏ గుర్తు ఇచ్చినా, ఆ పేర్లలో ఏ పేరు ఖరారు చేసినా తమకు ఓకేనని పేర్కొన్నారు..
Read Also: Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై మరో కేసు
Also Read
- Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
ఇక, ఇప్పుడు సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం.. కూడా ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేసింది.. బాకా, కత్తి వంటి వాటిని ఎన్నికల గుర్తులుగా ఎంచుకున్నారు.. ఈ మేరకు ఈసీకి చిహ్నాల జాబితాను సమర్పించారు.. బాకా, మొద్దుబారిన చిట్టడవి, కత్తి వంటి వాటిని తమ వర్గం చిహ్నంగా పరిగణించాలని పేర్కొన్నారు.. అంటే, రాబోయే అంధేరీ ఈస్ట్ అసెంబ్లీ ఉపఎన్నికలో థాకరే మరియు ఏక్నాథ్ షిండే వర్గాలు పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును ఉపయోగించకుండా ఎన్నికల సంఘం నిషేధించింది. అక్టోబర్ 1, 1989న విల్లు మరియు బాణం గుర్తును నమోదు చేయడానికి ముందు శివసేన.. కొబ్బరి చెట్టు, రైల్వే ఇంజిన్, కత్తి మరియు డాలు, మషాల్, కప్పు మరియు సాసర్ వంటి చిహ్నాలను ఉపయోగించింది… ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గం తన మూడు ఎన్నికల చిహ్న ఎంపికలను ఆదివారం ఎన్నికల కమిషన్ సమర్పించగా.. ఇవాళ షిండే వర్గం ఈసీకి విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!