Nominations: సూర్యాపేట, మహబూబ్నగర్లలో నామినేషన్లు దాఖలు చేసిన మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఇవాళే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన ఆయన.. పట్టణంలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
Read Also: Fraud Case of Rs 20 lakhs : కంపెనీ ఫ్రాంచైజీ ఇస్తానంటూ రూ.20 లక్షల మోసం.. ఐదుగురిపై కేసు నమోదు
Also Read
- Siddipet District: వివాహేతర సంబంధం.. యువకుడికి కొట్టి చంపిన మహిళ కుటుంబీకులు..
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ఇక, మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్గౌడ్ కమిషనర్గా పదోన్నతి పొందారు. అయితే, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు మహబూబ్నగర్ స్థానం నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి 3 వేల 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 57 వేల 775 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రి మండలిలో శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ వాయిదా
ఇక, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి జగదీశ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇవాళ ఉదయం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి 2001లో రాజకీయ ప్రవేశం చేసిన.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్బ్యూరో సభ్యుడిగా విధులు నిర్వహించారు. ఇక, 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
-
Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
-
IPL 2026 Final: రూ.68.75 కోట్ల పేస్ వార్.. ఆర్సీబీ-జీటీ ఫైనల్ ఫలితాన్ని నిర్ణయించేది బౌలర్లేనా?
-
Financial Planning Tips: సంపాదించడం ఒక ఎత్తు.. దాచడం మరో ఎత్తు! మిమ్మల్ని ధనవంతులను చేసే 7 రూల్స్ ఇవే!
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..