Nominations: సూర్యాపేట, మహబూబ్నగర్లలో నామినేషన్లు దాఖలు చేసిన మంత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఇవాళే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీంతో మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్ వేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన ఆయన.. పట్టణంలోని ఆర్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
Read Also: Fraud Case of Rs 20 lakhs : కంపెనీ ఫ్రాంచైజీ ఇస్తానంటూ రూ.20 లక్షల మోసం.. ఐదుగురిపై కేసు నమోదు
Also Read
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
ఇక, మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించిన శ్రీనివాస్గౌడ్ కమిషనర్గా పదోన్నతి పొందారు. అయితే, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు మహబూబ్నగర్ స్థానం నుంచి శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి 3 వేల 139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో 57 వేల 775 భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రి మండలిలో శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
Read Also: Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంలో విచారణ వాయిదా
ఇక, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి జగదీశ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఇవాళ ఉదయం సూర్యాపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదీశ్ రెడ్డి 2001లో రాజకీయ ప్రవేశం చేసిన.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్బ్యూరో సభ్యుడిగా విధులు నిర్వహించారు. ఇక, 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా జగదీశ్ రెడ్డి కొనసాగుతున్నారు.
తాజావార్తలు
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
-
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
-
Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
-
Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?