Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్లో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూటకపు మాటలు, చిలిపి పనులు చేసే పార్టీలు పెరిగిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవ చేశారు. అంతకుముందు గుజరాత్ గుడ్డి పాలనను ఆయన సరిదిద్దాలని అన్నారు. యాతాకుల భాస్కర్ దళిత జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
Read also: Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
- US: ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ విద్యార్థుల మృతి
దళితుల అభివృద్ధికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు భాస్కర్ ఆకట్టుకున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు ఇస్తోందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, 80కి పైగా మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి భక్తిని చాటుకున్నామన్నారు. ఆ మహానుభావుడి పేరును పార్లమెంటుకు పెట్టి కేంద్రం ముఖం చాటుకుందని విమర్శించారు. అంబేద్కర్ బాటలో నడిచే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని స్పష్టం చేశారు. గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, కాంగ్రెస్లకు లేదన్నారు. తాండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీటి సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ యాతాకుల భాస్కర్ సేవలను తప్పకుండా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
Psycho Husband: ఛీ.. నువ్వు భర్తవా సైకోవా.. భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి..ఉరివేసి చంపాడు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..