Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్లో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూటకపు మాటలు, చిలిపి పనులు చేసే పార్టీలు పెరిగిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవ చేశారు. అంతకుముందు గుజరాత్ గుడ్డి పాలనను ఆయన సరిదిద్దాలని అన్నారు. యాతాకుల భాస్కర్ దళిత జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
Read also: Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి
Also Read
- Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
దళితుల అభివృద్ధికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు భాస్కర్ ఆకట్టుకున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు ఇస్తోందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, 80కి పైగా మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి భక్తిని చాటుకున్నామన్నారు. ఆ మహానుభావుడి పేరును పార్లమెంటుకు పెట్టి కేంద్రం ముఖం చాటుకుందని విమర్శించారు. అంబేద్కర్ బాటలో నడిచే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని స్పష్టం చేశారు. గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, కాంగ్రెస్లకు లేదన్నారు. తాండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీటి సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ యాతాకుల భాస్కర్ సేవలను తప్పకుండా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
Psycho Husband: ఛీ.. నువ్వు భర్తవా సైకోవా.. భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి..ఉరివేసి చంపాడు
తాజావార్తలు
-
Mercury transit 2026: మే 29న అరుదైన “సరస్వతి యోగం”.. ఈ 6 రాశుల వారికి అదృష్టమే అదృష్టం
-
Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎగ్జిట్.. హైకమాండ్ ఫోర్స్ చేసిందా? ఆయనే లొంగిపోయారా?
-
Twisha Sharma: ట్విషా శర్మ రీ-పోస్ట్మార్టంలో షాకింగ్ ట్విస్ట్.. అత్త గిరిబాల సింగ్ అరెస్ట్
-
Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
-
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!