Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని మంత్రి హరీష్ రావ్ స్పష్టం చేశారు. ఎన్నికలు వస్తే కొన్ని పార్టీలు బూటకపు వాగ్దానాలు చేస్తాయని అన్నారు. కొన్ని పార్టీలు నినాదాలు ఇస్తాయి కానీ నినాదాలను నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుడు యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్లో చేరారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలోని అక్కా చెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బూటకపు మాటలు, చిలిపి పనులు చేసే పార్టీలు పెరిగిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ స్లోగన్ సర్కార్ కాదని, సొల్యూషన్ సర్కారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో అమలు చేయలేదన్నారు. కర్ణాటకలో బీజేపీపై కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. అమిత్ షాకు తెలంగాణపై అవగాహన లేదని, ఎవరో ఇచ్చిన స్క్రిప్టును చదివారని ఎద్దేవ చేశారు. అంతకుముందు గుజరాత్ గుడ్డి పాలనను ఆయన సరిదిద్దాలని అన్నారు. యాతాకుల భాస్కర్ దళిత జాతి అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.
Read also: Komatireddy: వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ఈ నెల రోజులైన 24 గంటల కరెంట్ ఇవ్వండి
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
దళితుల అభివృద్ధికి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలకు భాస్కర్ ఆకట్టుకున్నాయని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షలు ఇస్తోందని, రెసిడెన్షియల్ పాఠశాలలు, 80కి పైగా మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 1200 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి భక్తిని చాటుకున్నామన్నారు. ఆ మహానుభావుడి పేరును పార్లమెంటుకు పెట్టి కేంద్రం ముఖం చాటుకుందని విమర్శించారు. అంబేద్కర్ బాటలో నడిచే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని స్పష్టం చేశారు. గిరిజనుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ, కాంగ్రెస్లకు లేదన్నారు. తాండాలను గ్రామాలుగా మార్చామని, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదని, ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు మత కలహాలు, కరెంట్ సమస్యలు, నీటి సమస్యలతో సతమతమవుతున్నాయని అన్నారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం చేయాలని, బీఆర్ ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేశారని వెల్లడించారు. బీఆర్ఎస్ యాతాకుల భాస్కర్ సేవలను తప్పకుండా వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానం కల్పిస్తుందని తెలిపారు.
Psycho Husband: ఛీ.. నువ్వు భర్తవా సైకోవా.. భార్యకు విద్యుత్ షాక్ ఇచ్చి..ఉరివేసి చంపాడు
తాజావార్తలు
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
-
Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
-
LPG Tax: షాక్ తప్పదా..! ఎల్పీజీ సిలిండర్పై కొత్త పన్ను..? అసలు ప్రతిపాదన ఏమిటి..?
-
CJP: అవసరమైతే రాంచీకి వెళ్తాం.. జార్ఖండ్ విద్యార్థి ఉద్యమానికి సీజేపీ మద్దతు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!