Hyderabad: హరీష్ రావు ట్వీట్కు బీజేపీ శ్రేణులు కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్ పర్యటనపై.. ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు సెటైర్ వేసిన విషయం తెలిసిందే. అయితే.. దానికి ప్రతిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ నరసింహ జయంతిని ప్రస్తావిస్తూ హరీశ్ రావుకు కౌంటర్ వేసింది.
హిరణ్యకశిపుడిని అంతం చేసేందుకు లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమయ్యారని, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని నరసింహ జయంతిని జరుపుకుంటున్నామని బీజేపీ తెలిపింది. నరసింహ జయంతి అంటే చెడుపై మంచి సాధించిన విజయం అని కూడా తెలిపిన బీజేపీ.. అలా సరిగ్గా నరసింహ జయంతి నాడే తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తున్నారని, తెలంగాణలో కొనసాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ పర్యటన సాగుతోందన్న అర్థం వచ్చేలా బీజేపీ సదరు ట్వీట్ను పోస్ట్ చేసింది. అయితే ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్గా మారింది.
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
బీజేపీ ట్వీట్
Sri Lakshmi Narasimha Swamy appeared to kill the demon Hiranyakashipu. #NarasimhaJayanti signifies the victory of good over evil.
Not a coincidence, but a fierce avatar of Vishnu, a Slayer of evil in #Telangana. https://t.co/iC8O1nGGVP
— BJP Telangana (@BJP4Telangana) May 14, 2022
డీకే అరుణ:
హరీశ్ రావు చేసిన ట్వీట్కు బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ‘థ్యాంక్యూ హరీశ్ రావుజీ #AmitShahVisitsTelangana ట్విట్టర్ ట్రెండింగ్లో మీరూ పాల్గొన్నందుకు’ అని ఆమె ట్వీట్ చేశారు.
Thank you for participating in the #AmitShahVisitsTelangana Twitter trend, @trsharish Ji.
Hope you will also contribute to #BJP4Telangana.✌️ https://t.co/WqZDRHn8Sm
— D K Aruna (@aruna_dk) May 14, 2022
ధర్మపురి అరవింద్
హరీశ్ రావు చేసిన ట్వీట్కు పర్యావరణ సమతుల్యత & జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడానికి వలస పక్షులు చాలా అవసరం !తెలంగాణలో అభివృద్ధిలో డొల్లతనానికి కారణమైన చెదపురుగులు, చీడపీడలు తినడానికి కూడా వస్తారు! ఇది సహ-సంఘటన కాదు, కానీ మానవజాతిని రక్షించడానికి ప్రకృతి చట్టం! అంటూ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేసారు.
#AmitShahInSangramaYatra
Migratory birds are essential for maintaining ecological balance & biodiversity !In Telangana, they also come to eat away termites, pests causing hollowness in the development!
Its no co-incidence, but law of Nature to protect mankind !@AmitShah https://t.co/XnLeyradyg
— Arvind Dharmapuri (@Arvindharmapuri) May 14, 2022
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!