Harish Rao: కేసీఆర్ కారణజన్ముడు.. తెలంగాణ ఆదర్శంగా నిలిచింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు.. ప్రాజెక్టులు నిర్మాణం అయ్యేవి కావు.. నీళ్లు వచ్చేవి కావు.. ఆయన కారణజన్ముడు అంటూ ప్రశంసలు కురిపించారు ఆర్థికశాఖ మంత్రి హరీష్రావు.. రంగనాయక సాగర్ ఎడమ కాలువ ద్వారా రైతులకు గోదావరి నీటిని విడుదల చేసిన మంత్రి తన్నీరు హరీష్ రావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రావాల్సిన సహకారం రాకున్నా అత్యుత్తమ ఆర్థిక విధానాలతో తెలంగాణ ను అన్ని రంగాలలో ముందంజలో నిలుస్తుందన్నారు.. 7 సంవత్సరాల్లో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలిపారని.. కేంద్రం అనేక షరతులు, నిబంధనలు పెడుతూ.. ప్రాజెక్ట్ లకు నిధులు రాకుండా అడ్డు పడుతుందని మండిపడ్డారు.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, REC నుంచి అప్పుగా నిధులు రాకుండా అడ్డు పడుతుందని ఆరోపించిన ఆయన.. అత్యుత్తమ ఆర్థిక విధానాలతో ఏడేళ్లలో తెలంగాణ జీఎస్డీపీని రెట్టింపు చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్గా నిలిపారు.. అసలు కేసీఆర్ లేకపోతే స్వరాష్ట్రం తెలంగాణ లేదు.. తెలంగాణ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు… రంగనాయక సాగర్ జలాశయం ఉండేది.. సిద్దిపేట ప్రాంతానికి సాగు జలాలు వచ్చేవి కావన్నారు హరీష్రావు.
Read Also: TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలు పెంపు
Also Read
- Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
- Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
- Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
- Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లలో ఫైనల్ ట్విస్ట్.. ఇక అధికారులే ఇంటికొస్తారు.!
నియోజక వర్గ రైతాంగానికి నీళ్లు వదలడం చాలా సంతోషంగా ఉందన్నారు హరీష్రావు.. ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారన్న ఆయన.. ఒకప్పుడు తెలంగాణ గుక్కెడు తాగునీటి కోసం కష్టాలు పడ్డది నేడు సాగునీరు ఇస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు.. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని.. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకున్నా, ప్రాజెక్ట్లకు అడ్డుపడుతున్నా తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.. సిద్దిపేటతో పాటు సిరిసిల్ల, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు నీరు అందిస్తామని తెలిపిన హామీ ఇచ్చిన హరీష్రావు.. రైతాంగానికి బంగారు పంటలు పండే నీరు అందిస్తున్నారు అంటూ సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు.. గతంలో రైతులు చెమట చుక్కలతో కష్టపడి సంపాదించిన డబ్బు బోరు బావులకే సరిపోయేదని.. గత ప్రభుత్వాల హయాంలో కాలిపోయిన మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లతో అప్పుల పాలు అయ్యేవారని గుర్తుచేశారు.. కలలో కూడా ఊహించలేదు గోదావరి నీళ్లు వస్తాయని.. కానీ, అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయ్యిందని.. రాష్ట్ర ప్రజల పక్షాన సీఎం కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు మంత్రి హరీష్రావు.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!