Harish Rao: ప్రపంచం ముందు దేశం పరువు పోతోంది.. బీబీసీ ఐటీ దాడులపై హరీశ్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Harish Rao On BBC IT Raids: బీబీసీ కార్యాలయంపై జరుగుతున్న దాడులపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు స్పందించారు. బీబీసీ కార్యాలయంపై ఐటి దాడులు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తలు ప్రసారం చేస్తే బీబీసీపై ఐటీ దాడులు చేయిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ దాడుల కారణంగా ప్రపంచం ముందు దేశం పరువు పోతోందని వ్యాఖ్యానించారు. వార్తల్లో తప్పుంటే ఖండించి, ప్రజలకు వాస్తవం తెలియజేయాలి కానీ.. ఇలా ఐటీ దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. ఇప్పుడు రాజకీయాల్లో ఒక కాంగ్రెస్సోడు పేలుస్తా అంటే.. బీజేపోడు కూలుస్తా అంటున్నాడని చెప్పారు. కానీ.. కట్టేవాడు, నిర్మించేవాడే తెలంగాణ రాష్ట్రానికి అవసరమని చురకలంటించారు.
Suicide Attempt: నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు.. ఎలాగంటే..?
Also Read
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
- Mohammed Kala Basha: ‘కుర్చీ తాత’ ఇక లేరు.. ఒక్క డైలాగ్తో చరిత్ర సృష్టించిన బాషా గురించి ఆసక్తికర విషయాలు..
- Saraswati Pushkaralu 2026: కాళేశ్వరంలో ఆధ్యాత్మిక మహోత్సవం.. వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం..
గతంలో ఆంధ్రావాళ్ళు తమ ప్రాంతంలో ఒక ఎకరం అమ్మి, తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేది.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, అందుకు పూర్తి భిన్నంగా మారిందని హరీశ్రావు పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉన్న ఉత్తరప్రదేశ్ వైద్య సేవల అంశంలో చివరి స్థానంలో ఉందని.. కానీ తెలంగాణ మాత్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని ఉద్ఘాటించారు. తెలంగాణకు వచ్చి, ఇక్కడి వైద్య సేవలపై కామెంట్లు చేసే కేంద్రమంత్రులు.. వారి రాష్ట్రాల్లోని వైద్య సేవలు గురించి ఆలోచన చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం 88 వేల పోస్టుల భర్తీ చేయబోతున్నామని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లు వేస్తుంటే.. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని పేర్కొన్నారు.
Ravanasura: దిల్ ఇస్తే… ఫుల్ ఇచ్చింది అంట… ఇది ‘మాస్’ బ్రేకప్ సాంగ్
యాదాద్రిలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీ దేవుడిని వాడుకోదన్నారు. తెలంగాణలో వచ్చే ఏడాదిలో 9 వైద్య కళాశాలలు రానున్నాయని.. వాటిలో ఒకటి యాదాద్రికి కేటాయించనున్నట్లు ప్రకటించారు. బీజేపీ పాలిస్తున్న ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన కరెంటు కోతలు ఉన్నాయని, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఒక్క గుంట భూమి కూడా ఎండిపోకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తోందని చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను ప్రారంభించబోతున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Prithvi Shaw : సెల్ఫీ కోసం గొడవ.. క్రికెటర్ పృథ్వీ షా కారుపై దాడి!
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!