హుజురాబాద్ నియోజక వర్గం లో ఒక్క మహిళ భవనం ఒక్క డబుల్ బెడ్ కట్టలేదు. కానీ ధరలు పెంచిన ఆ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని అడిగారు మంత్రి హరీష్ రావు. హుజూరాబాద్ కు వచ్చి అభివృద్ది పనులతో పాటు కమ్యూనిటీ హల్ లు ఇచ్చిన. హుజూరాబాద్ లో పార్టీ కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా పని చేస్తున్న. ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురి చేస్తే తప్పు లేదు కానీ నేను హుజూరాబాద్ లో అభివృద్ది చేస్తే తప్ప అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుండి రెండు వేల కోట్లు తీసుకొస్తా పెంచిన ధర తగ్గిస్త అని బీజేపీ చెప్పాలి. టీఆరెఎస్ పార్టీ ఎం చేసిందో చెప్పింది… మరి బీజేపీ ఎం చేస్తుందో చెప్పాలి అని అడిగారు.
వచ్చే మార్చి బడ్జెట్ లో మిగితా రైతు రుణాల మాఫీ చేస్తాం. రెండున్నర సంవత్సరాల కోసం గెల్లు శ్రీనివాస్ ను గెలిపించండి. ఉద్యమకారుడు బీద కుటుంబం నుండి వచ్చిన గెళ్లు శ్రీనివాస్ కు ఓటు వేయండి అని కోరారు. ఈ రోజు మీటింగ్ కు గేల్లు శ్రీనివాస్ కు ఒక్క రూపాయి ఖర్చు కాలేదు కార్యకర్తలే ఖర్చు పెట్టుకున్నారు. రాష్ట్రంలో యాభై ఎడు ఏళ్లు నిండిన వారికి రాబోయే రెండు నెలల్లో పెన్షన్ లు ఇస్తాం అని తెలిపారు. కరోనా వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవం. రైతు లకు ఉచిత విద్యుత్ కోసం సీఎం ముఖ్యమంత్రి ఖర్చు పెట్టారు. రైతు బంధు,రైతు భీమ , ఉచిత విద్యుత్ మీద రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసింది. రైతు ల వద్ద ఒక్క రూపాయి కూడా వడ్డీ తీసుకోవద్దు రైతు రుణాల వడ్డీ నీ ప్రభుత్వమే కడుతుందాని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినం. పనిచేసే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునీ పనులు చేసుకోవాలి. కానీ బీజేపీ కి ఓటు వేస్తే ఢిల్లీ కి పోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.