పిఆర్సీ అమలు చేసిన సందర్భంగా సిద్దిపేటలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వంకు కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. దీనికి మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంటింటికి నీళ్లు ఇచ్చే విషయంలో కేంద్ర మంత్రి షెకావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. వారు బీజేపీ అయినా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు అంటే పని చేస్తేనే ప్రశంసిస్తారు అనే మాట గుర్తుంచుకోవాలి. దక్షిణ భారతదేశంలో తలసరి ఆదాయం లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ నాలుగు మూలలనాలుగు మల్టీ స్పెషల్ హాస్పిటల్ రానున్నాయి. దేశంలో రైతులకు నీళ్లు ఇచ్చి ఉచిత విద్యుత్ ఇచ్చి సాగుబడికి డబ్బు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అని పేర్కొన్నారు.