Gangula Kamalakar: తెలంగాణ పచ్చగా ఉండటాన్ని కేంద్రం చూడలేకపోతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు మంత్రి గంగుల కమలాకర్. కొనుగోళ్లు చేయకుండా కనీస మద్దతు ధర అంటే ఏం లాభం అని ప్రశ్నించారు. తెలంగాణ పచ్చగా ఉండటం చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని విమర్శించారు. కావాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. 2020 ఏప్రిల్ నుంచి ఐదు కిలోల ఉచినత బియ్యం అందిస్తున్నామని..90 లక్షల కార్డుల్లో 53 లక్షల మందికి మాత్రమే బియ్యాన్ని అందించిందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందరికి ఉచిత బియ్యం ఇచ్చిందని అన్నారు. ఉచిత బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటి వరకు రూ. 4720 కోట్ల భారం పడిందని అన్నారు.
మిల్లులో ఉన్న వడ్లు, బియ్యంపై ఎఫ్ సీ ఐకి ఎలాంటి అధికారం లేదని గంగుల అన్నారు. బియ్యం ఇచ్చాకే ఎఫ్ సీ ఐకి అధికారం వస్తుందని అన్నారు. తనిఖీల్లో తేడాలు వచ్చినా చర్యల తీసుకోలేదని ఆరోపణలు చేస్తున్నారని.. మార్చ్ లో ఆరు జిల్లాల్లో 40 మిల్లుల్లో ఎఫ్ సీ ఐ తనిఖీలు చేశారని..40,63,000,00 బ్యాగుల ధాన్యం మా వద్ద ఉందని..4,53,896 బ్యాగుల్లో తేడా ఉందని అన్నారు. ఒక్క గింజా తేడా వచ్చినా ప్రభుత్వ ఊరుకోదని..ముక్కు పిండి వసూలు చేస్తామని అన్నారు. రెండోసారి తనిఖీలు చేసి కేవలం 10 మిల్లుల్లో తేడా ఉందని అన్నారు. ఇప్పటికే మూడు మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టిందని, రెండు మిల్లుల్లో ధాన్యం రికవరీ చేశామని వెల్లడించారు.
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
చిన్న చిన్న సాకులతో ధాన్యం కొనుగోలు చేయబోమన ఎఫ్ సీ ఐ ప్రతీసారి అనడం తగదని ఆయన అన్నారు. ఎఫ్ సీ ఐ ధాన్యాన్ని తీసుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు. ఇన్నేళ్లు లేనిది ఎఫ్.సి.ఐ. మాపై ఎందుకు దాడి చేస్తోంది.? అని ప్రశ్నించారు. ఆయిల్ కంపెనీలు మా పరిధిలో లేవని.. పెట్రోల్, ఢిజిల్ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పామని.. స్టాకు ఉండీ కూడా ప్రజలకు పెట్రోల్, డిజిల్ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని గంగుల అన్నారు. మొత్తం 6584 కొనుగోలు కేంద్రాల్లో, 4200 కేంద్రాలలో పూర్తి 47,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!